Sharvanand : టైర్ టు హీరోల్లో అత్యంత ధనవంతుడు ఎవరంటే… హీరో శర్వానంద్ అట. ఈ విషయాన్ని పరిశ్రమ వర్గాలు ధృవీకరించాయి. ఆయన కూడా ఒకటి రెండు సందర్భాల్లో పరోక్షంగా వెల్లడించారు. శర్వానంద్ స్థితిమంతుల ఫ్యామిలీలో పుట్టాడు. నటన మీద మక్కువతో చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. హీరో రామ్ చరణ్, రానా దగ్గుబాటి శర్వానంద్ కి క్లాస్ మేట్స్. చిరంజీవి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ శర్వానంద్ సినీ ప్రస్థానం చిన్న చిన్న పాత్రలతో మొదలైంది. గౌరీ, శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రాల్లో శర్వానంద్ సపోర్టింగ్ రోల్స్ చేశారు.
యువసేన మూవీతో హీరోగా మారారు. ఆ సినిమా హిట్ కాగా శర్వానంద్ వెలుగులోకి వచ్చాడు. యువసేన మూవీలో నలుగురు హీరోలు ఉంటారు. దీంతో ఆ మూవీ విజయం సాధించినా శర్వానంద్ కి సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. శర్వానంద్ కి బ్రేక్ ఇచ్చిన మూవీ గమ్యం అని చెప్పొచ్చు. ప్రస్థానం మూవీతో మరింతగా నిలదొక్కుకున్నాడు. రన్ రాజా రన్ శర్వానంద్ కి ఫేమ్ తెచ్చిన సినిమా. ఆ విధంగా ఆయన టైర్ టూ హీరోల జాబితాలో సెటిల్ అయ్యారు.
అయితే శర్వానంద్ కోరుకుంటే సొంతగా సినిమాలు నిర్మించుకోగలడు. శర్వానంద్ కుటుంబానికి భారీగా ఆస్తులు ఉన్నాయట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో శర్వానంద్ ని నేరుగా అడగడం జరిగింది. హైదరాబాద్ లో ఏ ఏరియాకు వెళ్లినా మీకు ఆస్తులు ఉంటాయట? కోరుకుంటే సగం హైదరాబాద్ ని కొనేయగలరట? అని అడగ్గా… మరీ హైదరాబాద్ ని కోనేసేంత కాదు కానీ, ఆస్తులు బాగానే ఉన్నాయి. మాది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ.
అయితే నేను ఎప్పుడూ పేరెంట్స్ మీద ఆధారపడలేదు. టీనేజ్ నుండే నా సొంత ఖర్చులకు నేనే స్వయంగా డబ్బులు సంపాదించుకునేవాడిని. పేరెంట్స్ కూడా అదే కోరుకుంటారు. మనకు ఎంత ఉన్నా స్వయంగా ఎదగాలి, మనకంటూ ఒక వృత్తి, వ్యాపకం ఉండాలని అంటారని శర్వానంద్ చెప్పుకొచ్చారు. తనతో నిర్మాతలు ఎవరూ సినిమాలు చేయకపోయినా… తనకు తాను సినిమాలు చేసుకునే స్తోమత ఉందని ఆయన చెప్పకనే చెప్పారు. కొన్నాళ్లుగా శర్వానంద్ స్ట్రగుల్ అవుతున్నారు. 2017లో విడుదలైన మహానుభావుడు తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం దక్కలేదు.