Homeజాతీయ వార్తలుLok Sabha Election 2024: దక్షిణాది రాష్ట్రాల్లో 60 సీట్లపై బిజెపి గురి

Lok Sabha Election 2024: దక్షిణాది రాష్ట్రాల్లో 60 సీట్లపై బిజెపి గురి

గత ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మూడింట అసలు బిజెపి ఖాతా తెరవలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. కర్ణాటకలో మాత్రం 28 సీట్లకు గాను 25 స్థానాలను దక్కించుకుంది.

Lok Sabha Election 2024: దక్షిణాధి రాష్ట్రాల్లో బిజెపి పరిస్థితి ఏంటి? గత ఎన్నికల కంటే పుంజుకుంటుందా? లేకుంటే సీట్లు తగ్గుతాయా? అదే జరిగితే బిజెపి లక్ష్యం 370 సీట్లు దాటుతాయా? లేదా? ఇప్పుడు ఇదే చర్చగా మారింది. దక్షిణాధిన ఉన్న 130 స్థానాల్లో.. బిజెపి 29 స్థానాలకే పరిమితం అయ్యింది. కానీ ఈ ఎన్నికల్లోసగం సీట్లైనా దక్కించుకోవాలని బిజెపి భావిస్తోంది.కర్ణాటక,ఏపీ,తమిళనాడులో పొత్తులు కుదుర్చుకుంది. తెలంగాణ, కేరళలో ఒంటరి పోరు చేస్తోంది..

గత ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మూడింట అసలు బిజెపి ఖాతా తెరవలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. కర్ణాటకలో మాత్రం 28 సీట్లకు గాను 25 స్థానాలను దక్కించుకుంది. తెలంగాణలో 17 స్థానాలు గాను నాలుగింట విజయం సాధించింది. ఈ లెక్కన నాలుగు దక్షిణ రాష్ట్రాల్లో బిజెపి సాధించింది 29 స్థానాలే. అంటే ఇంకా 101 స్థానాల్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేనట్టే.

ఎన్డీఏ పరంగా 400 సీట్లు, బిజెపి పరంగా 370 సీట్లు సాధించాలని కాషాయ దళం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో గత రెండు ఎన్నికల కంటే బిజెపికి ఆదరణ తగ్గింది అన్న సంకేతాలు వస్తున్నాయి. తొలి మూడు విడతల పోలింగ్లో సైతం గణాంకాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. దీంతో బిజెపి దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందుకే ప్రధాని మోదీ తో పాటు అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు. భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రచారం చేస్తున్నారు.

గత పదేళ్లలో ప్రధాని మోదీ 120 సార్లు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించారు. అయితే అందులో 64 అధికారిక కార్యక్రమాలు కాగా.. 56 పార్టీ పర్యటనలు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.గత ఎన్నికల్లో ఏపీలో బిజెపి దారుణంగా ఓడిపోయింది. కేవలం 0.97 ఓట్లు మాత్రమే లభించాయి. కేరళలో 12 శాతం ఓట్లు వచ్చిన సీట్లు దక్కలేదు. తమిళనాడులో 3.6% ఓట్లు వచ్చాయి. ఈసారి తెలంగాణలో 10 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది బిజెపి. కర్ణాటకలో సైతం జిడిఎస్ తో పొత్తు పెట్టుకుంది. ఏపీలో టిడిపి,జనసేన తో కలిసి బరిలో దిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో 60 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో 300కు పైగా స్థానాలు సాధిస్తే.. తాము అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతామని బిజెపి భావిస్తోంది. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper