CM Revanth Reddy: రాజకీయాల్లో కొన్నేళ్లుగా బూతుపురాణం విపరీతంగా పెరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో ఊపు తెచ్చేందుకు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దానిని కొనసాగించడం మొదలు పెట్టారు. అధికారంలో ఉన్నా కూడా సీఎంస్థాయిలో ఉండి కూడా విపక్ష నేతలపై నోరు పారేసుకోవడం కొనసాగించారు. దీంతో విపక్ష నేతలు కూడా ఆయనకు అదే రీతిలో సమాధానం చెప్పడం అలవాటు చేసుకున్నారు. దీంతో తెలంగాణలో అన్ని పార్టీల్లో బూతు పురాణం సంస్కృతి వ్యాపించింది. ఇది ఇప్పుడు ఏపీకి కూడా వెళ్లింది. అమ్మ మొగుడు.. తాతా మొగుడు లాంటి పదాలు వాడుతున్నాయి. అయితే రాజకీయాల్లో ఈ బూతుపురానం నియంత్రణకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మీడియాకు ఓ చిట్కా చెప్పారు. అదేంటో తెలుసుకుందాం.
వాళ్లను చూపించొద్దట..
ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీవీకి సీఎం రేవంత్రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగాఎడిటర్ రాజకీయాల్లో బూతు నియంత్రణకు తీసుకునే చర్యల గురించి ప్న్రంచారు. దీనికి సీఎం ఓ చట్కా చెప్పారు. రాజకీయాల కోసం నాయకులు అలాంటి భావ వాడుతుంటారట. కానీ, ఆమాటలను టీవీల్లో చూపించడం ద్వారా దాని ఇంపాక్ట్ ప్రజలపై పడుతుందని తెలిపారు. అందుకే బూలు మాట్లాడిన నేతలను మీడియాలో చూపించొద్దని సూచించారు.
ఒకరిద్దరిని అరెస్టు చేస్తారట..
ఇక మరో అడుగు ముందుకేసి.. ఇలాంటి వీడియోలు చూపించకుండా ఉండేందకు.. ముందుగా టీవీల యజమానులను ఒకరిద్దరిని జైలుకు పంపాలని తెలిపారు. రాజకీయ నాయకులు పార్టీలకు మైలేజీ తేవడానికి మాట్లాడుతుంటారని, మీడియాకు సామాజిక బాధ్యత ఉన్నందున వాటిని చూపకుండా ఉండాలని పేర్కొన్నారు. మీడియా చూపడం వల్ల దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. మీడియా సామాజిక బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు.
రాజకీయాలు అంటేనే పబ్లిక్ లైఫ్..
ఇదిలా ఉంటే.. రేవంత్ మీడియా నియంత్రణకు సూచనలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తుల జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలన్న ఉద్దేవంతోనే మీడియా అన్ని విషయాలను కవర్ చేస్తుంది. వాళ్లు నియంత్రణలో ఉంటామని చెప్పడం మానేసి మీడియా వాళ్లను జైలుకు పంపుతామనడం ఏమేరకు సమంజసం అన్న చర్చ జరుగుతోంది. నియంత్రణ కోల్పోయి మాట్లాడుతున్న నేతలను మొదట జైల్లో పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఒకరిద్దరు నేతలను జైల్లో పెడితే.. మిగతా వారు మాట్లాడడం మానేస్తారని పేర్కొంటున్నారు.