Zee News: జాతీయ స్థాయిలో బీజేపీ అనుకూల మీడియాగా టౌమ్స్నౌ, రిపబ్లిక్ టీవీ, జీన్యూస్ ముందు వరుసలో ఉంటాయి. పార్టీకి అనుకూలమైన వార్తలను ప్రసారం చేయడంతోపాటు, ఆ పార్టీ నాయకులు నిర్వహించే కార్యక్రమాలు, సభలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటాయి. సర్వేల్లోనూ ఆ ఛానెళ్లు బీజేపీకి ఎడ్జ్ ఇస్తుంటాయి. అయితే సడెన్గా జీ న్యూస్లో బీజేపీ అనుకూల జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడుతున్నాయి. మోదీ, అమిత్షా ఎన్నికల ప్రచార సభలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడంలేదు. బీజేపీకి సంబంధించిన వార్తలు ఇవ్వడం లేదు. దీంతో జీ న్యూస్లో ఏం జరుగుతోంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కీలక ఉద్యోగుల తొలగింపు..
జీన్యూస్ యజమాని సుభాష్చంద్రగోయల్ నంరేంద్ర మోదీకి చాలా దగ్గర అన్న అభిప్రాయం మిగతా ఛానెళ్లు, పార్టీల్లో ఉంది. కానీ ఒక్కసారిగా బీజేపీ కార్యక్రమాలు నిలిపివేయడం, బీజేపీ అనుకూల ఉద్యోగల దొలగింపు చర్చనీయాంశమైంది. జీన్యూస్ సీఈవో అభయ్ వోజా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో డాక్టర్ ఇట్రిస్ లోహియాను నియమించారు. ఇక బీజేపీ అనుకూల, జాతీయవాద జర్నలిస్టుగా ఉన్న ప్రదీప్ భండారీ, జాతీయ వాద జర్నలిస్టుగా వెబ్సైట్ కూడా నడుపుతుంటారు. ఆయనను సెలవుపై వెళ్లాలని జీ యాజమాన్యం ఆదేశించింది. రెండు రోజుల క్రితం నరేంద్రమోదీ, అమిషా కార్యక్రమాలు ప్రసారం కావడం లేదు.
ఏం జరుగుతోంది…
జీన్యూస్లో వరుస పరిణామాలతో ఏదో జరుగుతోంది అన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. అయితే దీనిపై జీ యాజమాన్యం నుంచిగానీ, ఇటు బీజేపీ నుంచిగానీ, ఎలాంటి ప్రకటన రాలేదు. ఎన్నికల వేళ.. జీన్యూస్ బీజేపీతో తెగదెంపులు చేసుకుందా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని, హోం మంత్రితోపాటు, పార్టీ కార్యక్రమాల ప్రసారాలు నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది.