Balakrishna Veera Simha Reddy: ఎన్ని విమర్శలు వచ్చినా బాలకృష్ణ తీరు మారడం లేదు. ఆయన కోపాన్ని తగ్గించుకోవడం లేదు.పబ్లిక్ లో అభిమానులపై, సెట్స్ లో అసిస్టెంట్స్ పై చేయి చేసుకోవడం బాలయ్యకున్న చెడ్డ అలవాటు. తాజాగా బాలకృష్ణ వీరసింహారెడ్డి సెట్స్ లో వీరంగం చేశాడంటూ సమాచారం అందుతుంది. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ కి చాలా తక్కువ సమయం ఉంది. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం.
మిగిలిన షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి చెప్పిన ప్రకారం సంక్రాంతి బరిలో దిగాలని తొందర పడుతున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు షూటింగ్ పట్ల శ్రద్ధగా ఉండటం లేదు. దగ్గరుండి విషయాలు చూసుకోవడం లేదనే అసహనం బాలయ్యలో ఉందట. అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేని పట్ల ఆయన ఆగ్రహంగా ఉన్నారట. ఈ కోపాన్నంతా బాలకృష్ణ కాస్ట్యూమ్ వర్కర్ మీద చూపించాడట.
వీరసింహారెడ్డి సెట్స్ లో కాస్ట్యూమ్ వర్కర్ పై ఆయన ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారట. దుర్భాషలాడుతూ రెచ్చిపోవడంతో సెట్స్ లో ఉన్నవారంతా వణికిపోయారట. ఆ సమయంలో లొకేషన్ లో నిర్మాతలు కూడా లేకపోవడం బాలయ్య కోపాన్ని రెట్టింపు చేసిందట. బాలయ్య కోపాన్ని నేరుగా చూసిన కాస్ట్యూమ్ వర్కర్ భయానికి గురయ్యారట. తర్వాత దర్శక నిర్మాతలు ఇకపై ఎలాంటి లోపాలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి శాంతింపజేశారట. బాలయ్యతో తిట్లు తిన్న సదరు వర్కర్ నెక్స్ట్ డే సెట్స్ కి రాలేదట.
ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది మొదటిసారి కాదు. బాలకృష్ణ అనేక సందర్భాల్లో సహనం కోల్పోయి అభిమానులను, అసిస్టెంట్స్ పై చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బాలయ్య ప్రచార కార్యక్రమాల్లో కూడా కార్యకర్తలను కొట్టడం, ఎగిరి తన్నడం వంటివి చేశారు. బాలయ్య చర్యలను యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. అభిమానులు మాత్రం ఆయన చేయి తగలడమే అదృష్టం అంటూ కవర్ చేసుకుంటూ ఉంటారు.