Padma Awards 2024 : గణతంత్ర దినోత్సవం వేళ భారత ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి గురువారం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులకు పద్మ పురస్కారాలు దక్కాయి. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
ముగ్గురు తెలుగువారికి..
మొత్తం 34 మందికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పలువురికి ఈ జాబితాలో చోటు దక్కింది. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ఒకరికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి, తెలంగాణ నుంచి బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, నారాయణపేట జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఉమా మహేశ్వరి హరికథాగానం చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందారు.
వీరికి కూడా..
రోడ్డు ప్రమాదంలో గాయపడి వీల్చైర్కే పరిమితమై.. పేదలు, నిరాశ్రయులు, మహిళలు, అనాథలు, దివ్యాంగుల కోసం పనిచేస్తున్న హర్యానాకు చెందిన గుర్విందర్సింగ్, గిరిజన పర్యావరణ వేత్త, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న జార్ఖండ్కు చెందిన చామి ముర్ము, గిరిజన సంక్షేమం కసం పాటుపడుతున్న ఛత్తీస్గఢ్కు చెందిన జగేశ్వర్ను కూడా కేంద్రం పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తొలి మహిళా మావటిగా గుర్తింపు పొందిన అసోంకు చెందిన పర్బతి బరూహ్ను కూడా పద్మఖ పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. రాజస్థాన్కు చెందిన జానకీలాల్, మణిపూర్కు చెందిన మచిహన్సాసాకు కూడా పద్మపురస్కారం ప్రకటించింది. రాజస్థాన్కు చెందిన జానకీ లాల్, మణిపూర్కు చెందిన మచిహన్ సాసాలను కేంద్రం పద్మ శ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది.