Railway Budget 2024 : 2014లో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే మోడీ నాయకత్వంలో ముందుకు సాగుతామని చెప్పింది. అప్పటి నుంచి వరుసగా మూడు సార్లు (2024తో కలుపుకొని) మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన హయాంలో దేశంలోని చాలా మార్పులు తీసుకువచ్చారు. బ్రిటీష్ పాలకుల మరకలను చెరిపేసుకుంటూ వచ్చారు. అందులో రైల్వే బడ్జెట్ ఒకటి. మోడీ 3.0 తొలి సాధారణ బడ్జెట్ జూలై 23న లోక్ సభలో ప్రవేశపెట్టబోతోంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ఏడో సారి బడ్జెట్ ను పెట్టబోతున్నారు.
92 ఏళ్ల చరిత్రకు చరమగీతం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సితారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర (ఓట్ ఆన్) బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. భారత బడ్జెట్ చరిత్రను పరిశీలిస్తే మోడీ హయాంలో అనేక పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. వీటిలో ముఖ్యమైనది 92 ఏళ్ల తర్వాత మోడీ ప్రభుత్వంలో మారిన రైల్వే బడ్జెట్ కు సంబంధించినది. గత 92 సంవత్సరాలుగా (బ్రిటీష్ పాలన నుంచి) రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ వేర్వేరుగా ప్రవేశపెడుతున్నారు.
బడ్జెట్ చరిత్రను పరిశీలిస్తే, 2017లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేసిన ఈ మార్పునకు ముందు, దేశంలో రెండు రకాల బడ్జెట్లను ప్రవేశపెట్టేవారు. ఒకటి కేంద్ర బడ్జెట్, రెండోది రైల్వే బడ్జెట్. ఈ సమయంలో సాధారణ బడ్జెట్ లో ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, దేశ రక్షణ, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రకటనల గురించి సమాచారం ఇచ్చేది. అదే సమయంలో రైల్వేకు సంబంధించి కొత్త రైల్లు, కొత్త స్టేషన్లు, షెడ్యూల్ మార్పు తదితరాలను రైల్వే బడ్జెట్ లో పొందు పరిచి ప్రత్యేకంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.
1924 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. బ్రిటీష్ పాలనలో 1924లో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సాధారణ బడ్జెట్ కు ఒక రోజు ముందు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం కొనసాగుతోంది. కాని మోడీ ప్రభుత్వం 2017లో సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ ను విలీనం చేసింది. అప్పటి నుంచి ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఒకే బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.
మొదటి బడ్జెట్ అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారా?
ఏళ్ల తరబడి ఉన్న ఈ సంప్రదాయాన్ని మార్చి సాధారణ బడ్జెట్ ను, రైల్వే బడ్జెట్ ను కలిపి ఉమ్మడి బడ్జెట్ మొదట పార్లమెంటులో ప్రవేశపెట్టింది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. 2017 సాధారణ బడ్జెట్ లో తొలిసారి రైల్వే బడ్జెట్ కలపి ప్రవేశపెట్టారు. ఈ మార్పును ప్రభుత్వానికి సిఫారసు చేశారో కూడా ఇక్కడ ప్రస్తావించడం చాలా ముఖ్యం. కాబట్టి బ్రిటిష్ పాలన నుంచి వస్తున్న ఈ సంప్రదాయానికి స్వస్తి పలకాలని పాలసీ కమిషన్ సూచించింది.
రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ ఒకే బడ్జెట్ లో పెట్టడం వల్ల లోక్ సభ సమవేశాలకు సమయం కలిసి వస్తుంది. దీంతో పాటు రైల్వేకు సపరేట్ బడ్జెట్ తో దేశానికి ఒరిగేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక, విద్యా, వైద్యం, మౌలిక సదుపాయలకు కేటాయించిన విధంగానే రైల్వేకు కూడా కొంత మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు కానీ.. సపరేటుగా బడ్జెట్ కేటాయించడం లేదు. దీంతో చాలా వరకు ఆదా అవుతున్నాయని ఆర్థిక రంగ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ బడ్జెట్ లో కూడా కొత్త రైళ్లు, స్టేషన్ల డెవలప్ మెంట్, రూట్లు తదితరాలపై సమగ్రంగా వివరిస్తున్నట్లు చెప్తున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
View Author's Full InfoWeb Title: Railway budget has been changed as part of regular budget under modi government