ఈ ఏడాది ప్రారంభం నుంచే దేశాన్ని కరోనా చుట్టుముట్టింది. దీంతో సామాన్య ప్రజలతోపాటే రాజకీయ నాయకులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. మీటింగ్లైనా.. మరే సమావేశాలైనా అన్నీ వీడియో యాప్లతోనే నిర్వహించారు. ఇక అప్పటి నుంచి చాలా మంది ఇంకా ప్రజల్లోకి రావడం లేనే లేదు. ఈ కోవాలోకే వస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు. కరోనా ఎఫోక్ట్తో బాబు కొన్ని నెలలుగా ఏపీని వదిలి హైదరాబాద్కే పరిమితం అయ్యారు.
Also Read: విశాఖలో సామాన్యుడికి షాక్.. లక్షన్నర కరెంట్ బిల్లు..?
క్రమంలో దేశంలో.. రాష్ట్రాల్లోనూ కరోనా తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడిప్పుడు ప్రజలు రోడ్లెక్కుతున్నారు. ఎట్టకేలకు చంద్రబాబు కూడా అమరవతి చేరుకున్నారు. అభిమాన నేత చాలా రోజుల తర్వాత ఏపీకి చేరుకోవడంతో క్యాడర్ అంతా అక్కడికి చేరుకున్నారు. కానీ.. వారికి చంద్రబాబుతో సమావేశం అయ్యే ఛాన్స్ దక్కలేదట. కరోనా భయంతో చంద్రబాబు ఎవరినీ కలిసేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. దీంతో ఆయనను కలవడానికి వచ్చిన నేతలంతా అసంతృప్తితో వెనుదిరిగి వెళ్లిపోయారు. ‘ఈ మాత్రం దానికి ఆయన ఏపీకి ఎందుకు వచ్చినట్టు?’ అనే ప్రశ్నలూ పచ్చ చొక్కా నేతలే వేశారట. హైదరాబాద్లోనే ఉన్నా, అమరావతి వచ్చి ఎవరినీ కలవకపోయినా తేడా లేదు కదా? అని మాట్లాడుకుంటున్నారట.
ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న నేత నెలలకు నెలలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతే ఏ క్యాడర్కు అయినా నిరాసక్తతే ఉంటుంది. అంతేకాదు.. ఆ నేతను మరిచిపోవాల్సిన పరిస్థితులూ వస్తాయి. ఇప్పుడు చంద్రబాబుకు అలాంటిదే ఎదురైంది. ఎన్ని జూమ్ మీటింగ్లో పెట్టినా.. కార్యకర్తలతో డైరెక్ట్గా మాట్లాడింది వేరుగా ఉంటుంది కదా..! అన్నింటికీ మించి అసలు లోకేష్ ఏం చేస్తున్నట్టు?.
Also Read: టీడీపీ వలసలపై చంద్రబాబు ఆలోచన ఇదీ!
చంద్రబాబుకు అంటే వయసు మీద పడింది. ఈ వయసులో ఆయన బయటకు రాకపోవచ్చు. ఆ వయసు వారికి కరోనా ప్రమాదకరమని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇప్పుడే కాదు.. కరోనా పూర్తిగా పోయిందనే వరకు కూడా చంద్రబాబు జనం ముందుకు వచ్చే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు ఆయన కొడుకు లోకేష్ అయినా చొరవగా ముందుకు రావొచ్చు కదా? అయితే.. లోకేష్పై ముందు నుంచీ పార్టీ కార్యకర్తలకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఆయన పెద్దగా చొరవ చూపడనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. హైటెక్ బాబులా పేరొందిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కూడా ఇప్పుడు జూమ్ మీటింగ్ల్లోనే మునిగినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా.. ఆ తర్వాత ఫలితాలు మాత్రం పార్టీకి చేటు తెచ్చే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.