Jagan vs Pawan Kalyan : గత మూడు రోజులు విశాఖలో జరిగింది.. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? ఏ చైనానో, ఉత్తరకొరియా, రష్యాలో ఉన్నామా? అన్న సందేహం కలుగక మానదు. మనం ప్రజాస్వామ్య దేశం అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే.. మాట్లాడే హక్కు.. మీ భావాలు స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కు. 10 మంది ఒక చోట గుమిగూడే హక్కు, మీటింగ్ లు పెట్టుకునే హక్కు, ఎవరినైనా కలిసే హక్కు.. భారత రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టే ఇది ప్రజాస్వామ్య దేశం అంటారు.
కానీ గత మూడు రోజులుగా విశాఖలో ఏం జరిగింది? పవన్ ను నిర్బంధించి ప్రజలను కలుసుకోనివ్వలేదు. వింటేనే ఆశ్చర్యం కలుగుతోంది. ఇదెక్కడి చోద్యమో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్టులో దిగిన నుంచి ఆయనను పంపించే దాకా.. అన్నీ నిర్బంధాలు.. మాట్లాడనీయకపోవడం.. నిద్రపోలేని పరిస్థితి. హోటల్ లో గందరగోళ పరిస్థితులు.. బీభత్స భయానక పరిస్థితులు కల్పించారు.
ఇది జనసేన కావాలని రెచ్చగొట్టిందని జగన్ మీడియా ప్రచారం చేస్తోంది. మరి ఎవరు ఎవరిని రెచ్చగొట్టారు? విశాఖ వ్యవహారంలో ఎవరిది తప్పు? అన్న దానిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..