rathika1
Bigg Boss 7 Telugu : 14 మంది కంటెస్టెంట్లతో ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 7 లో సీజన్ కొంచెం ఇంట్రెస్టింగ్.. గా కొంచెం బోరింగ్ గా సాగుతోంది. గత ఎపిసోడ్స్ ఎక్కువ టిఆర్పి తెచ్చుకోకపోవడంతో ఈసారి బిగ్ బాస్ తప్పకుండా మంచి కంటెంట్లను తీసుకొస్తారు అనుకున్నారు అందరూ. కాగా కొంతమంది మంచి కంటెస్టెంట్లను తీసుకొచ్చిన కొంతమంది మాత్రం మళ్లీ బోరింగ్ వారినే తీసుకొచ్చాడు బిగ్ బాస్ మేకర్స్.
అయితే ఈ 14 మందిలో ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టి ఆకట్టుకుంటూ ఓటింగ్ స్వరంగా దూసుకుపోతున్న వ్యక్తి పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డగా, కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ టాస్కుల్లో మంచి పర్ఫామెన్స్ ఇస్తూ.. రతిక తో పులిహార కలుపుతూ ఈవారం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు. అయితే తాజా ఎపిసోడ్లో రతికకు కిస్ ఇచ్చి ప్రేక్షకులకు పెద్ద షాక్ కి ఇచ్చారు ప్రశాంత్..
సాధారణంగా బిగ్ బాస్ అంటే చిన్న చిన్న ప్రేమ కథలు జరగడం సహజమే. ఇక బిగ్ బాస్ మొదటి వారంలోనే రతికతో తనకు ఏదో ఉంది అంటూ ప్రశాంత్ ప్రొజెక్ట్ చేయడం గమనర్హం.
ఇక నిన్న శనివారం కావడంతో ప్రేక్షకులతో పాటు నాగార్జున కూడా బిగ్ బాస్ హౌస్ ని వీక్షించారు. ఈ ఎపిసోడ్లో ప్రశాంత్ మరీ ఎక్కువగా పులిహార కలిపేశాడు. బిగ్ బాస్లోకి రతిక రోజ్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆమెకు నాగార్జున ఒక బ్రేక్ హార్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ బ్రేక్ హార్ట్ ను ఒక్కటి చేసి మోకాళ్లపై కూర్చుని రతికకు అందించాడు. ఇక ఇది చూస్తే ప్రశాంత్ దాదాపుగా రతికక లవ్ ప్రపోజల్ చేసినట్లుగా మనకు అనిపించక మానదు. కాగా ఈ పని చేసే ముందు ప్రశాంత్ ముందుగా తాను చేసినట్టుగానే మొదట రతికను చేయమని, అదే డిఫరెంట్ అని చెప్పాడు. కానీ, రతిక చేయలేదు.
ఇక ఆ తరువాత మోకాళ్లపై కూర్చుని కలిపిన హార్ట్ ను రతికకు ఇచ్చేశాడు. మరోపక్క ఇదంతా చూసిన శివాజీ వాటే సీన్ అంటూ పొగిడాడు. ఆ తరువాత రతిక అన్నం తింటుంటే పక్కనే వచ్చి కూర్చొని తనకి కూడా అన్నం పెట్టమని ప్రశాంత్ అడిగాడు. చేతిలో పెడతాను అని రతిక అంటే.. కాదు, అలా చేతిలో పెడతారా.. ముద్దలు కలిపి నోట్లో పెట్టు అన్నట్లుగా మాట్లాడాడు. మొదట్లో పెట్టను అని చెప్పినా.. ప్రశాంత్ పరసగా అడుగుతూ ఉండడంతో ముందు మూడు ముద్దలు చేతిలో పెడతాను, తర్వాత మూడు ముద్దలు నోట్లో పెడతాను అని రతిక అంది. దానికి ప్రశాంత్ ఒప్పుకోవడంతో చేతిలో ముద్ద కలిపి పెట్టింది రతిక.
ఇక రతిక ముద్దలు పెడుతుంటే తియ్యగుందీ అని ప్రశాంత్ అన్నాడు. దీనికి శివాజీ నవ్వాడు. తర్వాత ప్రశాంత్కు నోట్లో ముద్ద పెట్టకుండానే రతిక అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక రతిక అలా చేయడంతో పల్లవి ప్రశాంత్ ఒకసారిగా షాక్ అయ్యాడు.
ఇక ఆ తరువాత సోఫాపై పల్లవి ప్రశాంత్ తన పేరు తానే రాసుకొని.. పక్కన ఒక లవ్ సింబల్ వేసుకొని మురిసిపోయారు. ఇంతలో రతిక వచ్చి ఆ లవ్ సింబల్ పేర్లను చూసి.. నీ పేరు నువ్వే రాసుకుని ముద్దులు పెట్టుకుంటున్నావా అని అడిగింది.రతిక అలా అనడంతో ఎదురుగా ఉన్న ఆమెను పోనీ నుకు పెట్టనా అని పల్లవి ప్రశాంత్ అన్నాడు. అంతేకాకుండా రతికకు ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. ఇక ఇదంతా చూసిన రతిక నవ్వేసింది.
ఇలా తనదైన స్టైల్ లో రతిక తో లవ్ స్టోరీ నడుపుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు పల్లవి ప్రశాంత్.