Jobs Without Exam: భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రాజెక్ట్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే భారీస్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. రాతపరీక్ష లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది.
ప్రాజెక్ట్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 30 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. http://www.niab.org.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బీఎస్సీ/ఎమ్మెస్సీ/ఎంవీఎస్సీ సంబంధిత స్పెషలేజేషన్ లో చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
Also Read: RRR Movie Actors Remuneration: RRR : ఏ స్టార్ కి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా?
2022 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుందని తెలుస్తోంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.20,000ల నుంచి రూ.31,000ల వరకు వేతనంగా లభిస్తుందని సమాచారం అందుతోంది. అర్హత ఉనవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతోంది.
యూజీసీ నెట్లో అర్హత ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.