Benefits For N.T.R: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ – ఎన్టీఆర్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా స్క్రిప్ట్ పై ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఆచార్య ప్లాప్ తర్వాత దర్శకుడు కొరటాల శివ ఆలోచనలో పడ్డాడు. అందుకే.. ఉన్నట్టు ఉండి ఎన్టీఆర్ సినిమా కథకు సంబంధించి రిపేర్లు స్టార్ట్ చేశాడు.
ఆచార్య ప్లాప్ కు మెయిన్ రీజన్… కథ బాగా బలహీనంగా ఉండటం. అలాగే కొరటాల టేకింగ్, అండ్ నెరేషన్ కూడా బాగా స్లోగా ఉండటం. అందుకే.. కొరటాల ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కోసం ఈ అంశాల పై మళ్లీ చెక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా నెరేషన్, స్క్రీన్ ప్లే లోపాలతో పాటు కథలో కూడా కీలక అంశాలను పరిశీలిస్తున్నారు.
అలాగే, ఎన్టీఆర్ సినిమా స్క్రిఫ్ట్లో మెయిన్ గా బలమైన ఎమోషన్లు, మరియు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగే ట్రాక్స్ ను ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి ఆచార్య ప్లాప్ ఎన్టీఆర్ సినిమాకి బాగా కలిసొచ్చేలా ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి.. కచ్చితంగా హీరోయిన్ని కూడా ఆ స్థాయిలో ఉన్న బ్యూటీనే తీసుకోవాలి.
Also Read: Senior NTR: రెండు రోజులైనా ఎన్టీఆర్ లేవలేదు.. ఆమె ఏడుస్తూనే ఉంది !
అందుకే.. కియారా అద్వానీ పేరు బాగా వినిపిస్తోంది. అలాగే రష్మిక మందన్నా పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఫైనల్ గా ఈ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తోందో చూడాలి. ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి.
గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మలచబోతున్నాడు. అందుకోసం.. హాలీవుడ్ యాక్షన్ టెక్నీషియన్స్ ను పెట్టుకుంటున్నాడు. మరి చూడాలి.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. ఇక కొరటాల ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ ఓ సోషల్ మెసేజ్ పాయింట్ ను చెప్పబోతున్నాడు.
కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే జులై నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది.
Also Read: NTR- Koratala Siva Film: ఎన్టీఆర్ కోసం ముగ్గురు హీరోయిన్లు.. కొరటాల ఏమి చేస్తాడో ?