Karnataka : ఏదేదో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి.. ఓ సినిమాలో బాలయ్య డైలాగ్ ఇది.. దీనిని కొద్దిగా మార్చి కర్ణాటక ఓటర్లకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలకు ముందు ‘ఎన్నెన్నో చెబుతాం.. అన్నీ నెరవేరుస్తామా ఏంటి’ అన్నట్లు ఆ పార్టీ వ్యవహరిస్తోంది. అక్కడ కొత్త సర్కార్ కొలువుదీరి వారం రోజులు కూడా కకముందే పాలక పక్షం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోనే కారణం. ఐదు ప్రధాన హామీలు నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ కూడా అధికార పార్టీకి అల్టిమేటం జారీ చేసింది. తాజాగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ తమ్ముడు డీకే. సురేశ్ మరోషాక్ ఇచ్చాడు. ఎన్నికల వేళ ఓటర్లకు పంచిన ఓచర్లు పనిచేయకుండా చేశాడు.