spot_img
Homeఎన్నికలుLok Sabha Election 2024: తల్లిదండ్రులు ఓటేస్తే.. పిల్లలకు 10 మార్కులు ఫ్రీ..

Lok Sabha Election 2024: తల్లిదండ్రులు ఓటేస్తే.. పిల్లలకు 10 మార్కులు ఫ్రీ..

Lok Sabha Election 2024: ఎన్నికల్లో గెలవడం కోసం అభ్యర్థులు ప్రజలకు వరాలు గుప్పిస్తారు. తాయిలాలు ఇస్తారు. ఇది సాధారణం. కానీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు కూడా ఇప్పుడు అనేక సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల సంఘంలో కలిసి పోలింగ్‌ శాతం పెంచడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బిర్యానీ ఫ్రీ, ఆస్పత్రుల్లో ఓపీ ఫ్రీ, ఫ్లైట్‌ టికెట్‌ చార్జీల్లో రాయితీ, సినిమా టికెట్లలో డిస్కౌంట్‌ వంటి ఆఫర్లు ప్రకటించాయి. తాజాగా యూపీలోని ఓ స్కూల్‌ యాజమాన్యం తమ పాఠశాలలో చదివిలే పిల్లల తల్లిదండ్రులు ఓటు వేస్తే.. పిల్లలకు 10 మార్కులు అదనంగా ఇస్తామని ప్రకటించింది.

యూపీలోని స్కూల్‌ యాజమాన్యం నిర్ణయం..
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 543 స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్‌ పూర్తయింది. మొదటి మూడు విడతల్లో 60 శాతం లోపే పోలింగ్‌ నమోదైంది. నాలుగో విడతలో కాస్త పెరిగింది. మే 21న ఐదో విడత పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో యూపీ రాజధాని లక్నోలోని స్కూళ్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తమ స్కూళ్లలో చదివే పిల్లల తల్లిదండ్రులు ఓటే వేస్తే విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 మార్కులు అదనంగా వేస్తామని సెయింట్‌ జోసెఫ్‌ విద్యా సంస్థల యాజమాన్యం ప్రకటించింది. అలాగే తమ స్కూళ్లలో పనిచేసే సిబ్బంది ఓటువేస్తే వారికి ఒక రోజు వేతనం అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మే 21న యూపీలో ఎన్నికలు జరుగనున్నాయి.

పోలింగ్‌ శాతం పెంచడానికే..
ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటు వేయడం ద్వారా మంచి నేతను ఎన్నుకునే అవకాశం ఉంటుందని స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌ 50 శాతం, 60 శాతమే నమోదైన నేపథ్యంలో ఐదో విడతలో పోలింగ్‌ పెంచేందుకు ఈ ఆఫ్‌ ప్రకటించినట్లు తెలిపింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు పౌరులంతా ఓటు వేయాలని కోరింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper