Homeక్రీడలుRCB Vs CSK: వరుస ఓటముల నుంచి ప్లేఆఫ్ దాకా.. సన్ రైజర్స్ రికార్డు బద్దలు...

RCB Vs CSK: వరుస ఓటముల నుంచి ప్లేఆఫ్ దాకా.. సన్ రైజర్స్ రికార్డు బద్దలు కొట్టిన ఆర్సీబీ

RCB Vs CSK: చెన్నై జట్టుతో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో.. బెంగళూరు రేపు వైపే వెళ్ళింది. ఉత్కంఠ గా సాగిన మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో విజయాన్ని సాధించి ప్లే ఆఫ్ చేరుకుంది.. వరుసగా ఆరు మ్యాచ్ లలో విజయాన్ని సాధించి.. తిట్టిన వారి నోటితోనే పొగిడించుకుంటున్నది. సొంత మైదానంలో.. వర్షం ఇబ్బంది పెట్టినప్పటికీ.. అద్భుతమైన ఆటతీరుతో చెన్నై జట్టును ఓడించింది. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంలో చెన్నై చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఇదే సమయంలో బెంగళూరు అనేక రికార్డులను బద్దలు కొట్టింది.

ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో 150 సిక్స్ లు కొట్టిన తొలి జట్టుగా బెంగళూరు చరిత్రకెక్కింది. ఐపీఎల్ మాత్రమే కాకుండా ఒక టి20 టోర్నీలో ఒక జట్టు 150 సిక్సులు కొట్టడం ఇదే తొలిసారి. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై జట్టు జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఈ అరుదైన ఘనతను సాధించింది. ఈ మ్యాచ్లో బెంగళూరు మొత్తం 16 సిక్సులు కొట్టి ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఇదే సమయంలో హైదరాబాద్ జట్టు పేరు మీద ఉన్న ఘనతను అధిగమించింది. ఇప్పటివరకు హైదరాబాద్ 146 సిక్స్ లతో ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది. దీనిని బెంగళూరు అధిగమించింది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ నాలుగేసి సిక్స్ లు కొట్టారు. ఫాఫ్ డూ ప్లెసిస్, గ్రీన్ తలా మూడు సిక్స్ లు బాదారు. దినేష్ కార్తీక్, మ్యాక్స్ వెల్ చెరో సిక్స్ కొట్టారు.

ఈ మ్యాచ్లో ముందుగా బెంగళూరు బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 218 రన్స్ చేసింది. డూ ప్లెసిస్ 54, రజత్ పాటిదార్ 41, విరాట్ కోహ్లీ 47 పరుగులతో విధ్వంసాన్ని సృష్టించారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. మిచెల్ శాంట్నర్, తుషార్ దేశ్ పాండే చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో 218 రన్స్ చేయడం ద్వారా బెంగళూరు సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ సీజన్లో ఎక్కువసార్లు 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్, కోల్ కతా తో సమానంగా నిలిచింది.

ఈ సీజన్లో బెంగళూరు తో పాటు, కోల్ కతా కూడా ఆరుసార్లు 200 కంటే ఎక్కువ పరుగులు చేసింది.. గత సీజన్లో ముంబై ఇండియన్స్ ఆరుసార్లు 200 కంటే ఎక్కువ పరుగుల స్కోరు నమోదు చేసింది. అయితే ఆ స్థాయిలో ఆడినప్పటికీ ముంబై గత ఏడాది విజేతగా నిలవలేకపోయింది. ఈ ఏడాది కూడా దారుణమైన ఆటతీరుతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఇక తాజా విజయంతో బెంగళూరు దర్జాగా ప్లే ఆఫ్ వెళ్ళింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular