Star Singer : స్టార్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రోడ్ సైడ్ సింగర్ తో గొంతు కలిపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. సామాన్యులు కూడా కొన్ని పనులు చేయడానికి ఇష్టపడరు. అలాంటిది ఒక సెలెబ్రిటీ సింగర్ డబ్బుల కోసం రోడ్డు పక్కన పాటలు పాడే బ్లైండ్ సింగర్ తో గొంతు కలిపింది. ఆయనతో పాటు పాట పాడింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు ఎం ఎం శ్రీలేఖ. టాలీవుడ్ లో రాణించిన ఏకైన లేడీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం శ్రీలేఖ. ఈమె పలు భాషల్లో 75 కి పైగా చిత్రాలకు మ్యూజిక్ అందించారు. అలాగే కొన్ని పాటలు పాడారు.
శ్రీలేఖ కెరీర్ 1992 లో మొదలైంది. తమిళ చిత్రం నాలయ తీర్పు మూవీతో ఆమె మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. తాజ్ మహల్ చిత్రానికి శ్రీలేఖ అందించిన సాంగ్స్ సూపర్ హిట్. శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్ మహల్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. శివయ్య, ప్రేయసి రావే, ధర్మచక్రం, ప్రేమించు వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అత్యధిక చిత్రాలకు మ్యూజిక్ అందించిన లేడీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆమె వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు.
కాగా శ్రీలేఖ ఇటీవల విజయవాడ వెళ్లారు. ఆమె రోడ్డు పక్కన పాటలు పాడుతున్న ఒక బ్లైండ్ సింగర్ ని చూశారు. మాస్క్ ధరించి అతని వద్దకు వెళ్లిన శ్రీలేఖ ఆయనతో పాటు ఒక డ్యూయట్ పాడారు. ఎం ఎం కీరవాణి స్వరపరచిన ”రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా” సాంగ్ ఆమె పాడారు. రాజశేఖర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అల్లరి ప్రియుడు చిత్రంలోని ఈ సాంగ్ ని శ్రీలేఖ, బ్లైండ్ సింగర్ కలిసి పాడారు. సదరు బ్లైండ్ సింగర్ జీవితం బాగుండాలని, అతనికి మంచి జరగాలని శ్రీలేఖ కోరుకుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీలేఖ మంచు మనసును పలువురు కొనియాడుతున్నారు. ఆమె డౌన్ టు ఎర్త్ నేచర్ ని మెచ్చుకుంటున్నారు. శ్రీలేఖ దిగ్గజ దర్శకుడు రాజమౌళి, కీరవాణిలకు కజిన్ అవుతారు. పరిశ్రమలో గట్టి పరిచయాలు ఉన్నా… శ్రీలేఖ మాత్రం అవేవీ ఉపయోగించుకోరట. తన వర్క్ నచ్చి సినిమా చేయమని వచ్చిన వాళ్ళకే పని చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.