Jagan
Jagan: ఏడు నెలల కిందట తెలంగాణ ఎన్నికలు గుర్తున్నాయి కదూ.. నాటి ఎన్నికల్లో కేసీఆర్ ఎంతలా ధీమా వ్యక్తం చేశారో.. ఎంతలా భీరాలు పలికారో తెలియంది కాదు. అయితే తెలంగాణ ప్రజలు కేసిఆర్ కు కర్ర కాల్చి వాత పెట్టారు. అధికారం నుంచి దూరం చేశారు. అసలు సిసలు సినిమా చూపించారు రేవంత్ రెడ్డి. కెసిఆర్ ను ఫామ్ హౌస్ కు పరిమితం చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టాయి. బిఆర్ఎస్ శ్రేణులు భయపడిపోయాయి. అప్పుడే కెసిఆర్ ఎంట్రీ ఇచ్చారు. పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. ఫలితాలు విడుదలకు రెండు రోజుల ముందు మీడియా ముందుకు వచ్చారు. మనం హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని ప్రకటించారు. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండండి అంటూ ఓదార్పు మాటలు చెప్పారు. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. అయితే ఇటువంటి మాటలే ఇప్పుడు ఏపీలో జగన్ చెబుతుండడం అందరికీ ఆశ్చర్యం వేస్తోంది.
ఏపీలో భారీగా పోలింగ్ నమోదయింది. వైసీపీ ఎత్తుగడలకు కూటమి నేతలు చెప్పగలిగారు. ప్రజలు నోటుకు కాకుండా ఓటుకు విలువనిచ్చారు. మరోవైపు సర్వేలు కూటమికి పట్టం కట్టాయి. ఫ్యాన్ రెక్కలు విరిగాయంటూ మౌత్ ప్రచారం ప్రారంభమైంది. ఇవన్నీ వైసీపీలో నైరశ్యానికి కారణమయ్యాయి. ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించాల్సిన జగన్.. కోట్లాది రూపాయలు ఇచ్చి పెట్టుకున్న ఐప్యాక్ టీం వద్ద విక్టరీ కొట్టబోతున్నామని ప్రకటించారు. విదేశాలకు చెక్కేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా హింస రేగినా ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా స్పందించాల్సింది పోయి విహారయాత్రలకు వెళ్లిపోయారు. నీతో నాకు పని పూర్తయింది అన్నట్టుగా.. నీ చావు మీరు చావండి అంటూ పార్టీ క్యాడర్ను, రాష్ట్ర ప్రజలను దాడులకు వదిలేసి వెళ్లిపోయారు. అయితే జగన్ వ్యవహార శైలి చూస్తున్నవారు ఇక్కడ ఏదో తేడా కొడుతుందే అంటూ సోషల్ మీడియాలోఫలితాలకు ముందు కేసీఆర్ చేసిన కామెంట్స్ ను.. ఇప్పుడు జగన్ చెప్పిన మాటలను సరిపోల్చి పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.