Janhvi Kapoor: జాన్వీ కపూర్ చేసింది తక్కువ చిత్రాలే. అయినా ఇండియా వైడ్ ఫేమ్ ఉంది అమ్మడుకి. అందుకు కారణం లేకపోలేదు. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్. నటిగా కొనసాగుతూనే మోడల్ గా భారీగా ఆర్జిస్తోంది. ఈ క్రమంలో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తరచుగా గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తుంది. జాన్వీ కపూర్ గ్లామరస్ వీడియోలు, ఫోటోషూట్స్ విపరీతంగా వైరల్ అవుతుంటాయి. కాముడు చెక్కిన శిల్పంలా ఉండే జాన్వీ కపూర్ అంటే కుర్రాళ్ళు వెర్రెత్తిపోతుంటారు. వాళ్ళను డిజప్పాయింట్ చేయకుండా అందాలతో విందు చేస్తూ ఉంటుంది. జాన్వీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు.
కేవలం ఇంస్టాగ్రామ్ ద్వారా జాన్వీ కి వచ్చే ఆదాయం లక్షల్లో ఉంటుంది. వీటన్నింటికీ మించి జాన్వీ కపూర్ అంతలా ఫేమస్ కావడానికి రీజన్ ఆమె శ్రీదేవి వారసురాలు. దశాబ్దాల పాటు ఇండియన్ సినిమాను షేక్ చేసిన శ్రీదేవి కి ఇద్దరు కుమార్తెలు కాగా, జాన్వీ పెద్దమ్మాయి. శ్రీదేవి తన నట వారసురాలిగా జాన్వీని బాలీవుడ్ కి పరిచయం చేసింది. జాన్వీ మొదటి చిత్రం దఢక్. 2018లో ఈ చిత్రం విడుదలైంది. అయితే దఢక్ విడుదల కాకుండానే జాన్వీ కపూర్ మరణించింది.
దుబాయ్ హోటల్ లో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో మునిగి శ్రీదేవి కన్నుమూసింది. శ్రీదేవి హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. శ్రీదేవి మరణించే నాటికి దఢక్ విడుదల కాలేదు. సిల్వర్ స్క్రీన్ పై కూతురిని చూసుకోవాలన్న కల నెరవేరకుండానే శ్రీదేవి మరణించింది. అమ్మ దూరమైనా జాన్వీ ఆమెను మరచిపోలేకుంది. అమ్మ ప్రేమకు గుర్తుగా తన మొబైల్ లో వాల్ పేపర్ గా శ్రీదేవి ఫోటో పెట్టుకుంది జాన్వీ. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఓ ఈవెంట్ కి హాజరైన జాన్వీ కపూర్ వెనుక ఫోటోగ్రాఫర్స్ పడ్డారు. వారికి అభివాదం చేసి కారులో కూర్చున్న జాన్వీ ఫోన్ ఆన్ చేసింది. స్క్రీన్ పై ఉన్న ఫోటో కనిపించింది. జాన్వీ కపూర్ చిన్న పాపగా ఉన్నప్పుడు శ్రీదేవి కూతురిని ముద్దు చేస్తున్న ఫోటో అది. ఈ అరుదైన ఫోటోను వాల్ పేపర్ గా పెట్టుకుంది జాన్వీ కపూర్. ఇక ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకుడు.