Nagarjuna-Chiranjeevi: తెలుగులో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న చిరంజీవి తను చేసిన మొదటి సినిమాలో ఎలాంటి ఎఫర్ట్ అయితే పెట్టి వర్క్ చేశాడో ఇప్పుడు చేస్తున్న సినిమాలో కూడా అలాంటి ఎఫర్ట్ పెట్టే వర్క్ చేస్తున్నాడు. ఒక నటుడు ఒక సినిమా మీద పూర్తి ఎఫర్ట్ పెట్టనప్పుడు ఆ సినిమా చేయకుండా ఉండడమే ఉత్తమం అని చిరంజీవి చెబుతూ ఉంటాడు. అందుకే ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కూడా పొద్దున లేచి ఎక్సర్ సైజ్ చేసి ఆ తర్వాత సినిమా షూటింగ్ కి హాజరవుతూ ఉంటాడు.
అందరికంటే ముందే చిరంజీవి సెట్ లో ఉంటాడు. అంత డెడికేషన్ ఉంది కాబట్టే ఆయన ఇప్పటికీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈయనతో పాటు సినిమాలు చేసిన మరొక హీరో నాగార్జున…ఈయన చేసిన సినిమాలు అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు కూడా ఆయన కింగ్ గా కొనసాగుతున్నప్పటికీ మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు అయితే వచ్చాయి దానివల్ల ఇప్పుడు ఆయన కొంతవరకు సఫర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తన వందో సినిమా చేయడం కోసం నాగార్జున కథలను వింటున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్టు కొడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జునను చిరంజీవి ఇంటికి పిలిచి చేపల కూర వండి పెట్టిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే చిరంజీవి ఎందుకు ఆయనకి వండి పెట్టాడు అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే చిరంజీవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సినిమాకి వెళ్లారట.
ఇంట్లో ఒక్కడికే బోర్ కొడుతున్న చిరంజీవి నాగార్జునకి ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అని అడిగితే ఖాళీగా ఉన్నాను అని చెప్పడంతో ఇక్కడికి రా నీకు చేపల కూర వండి పెడతానని చెప్పి మరి అతన్ని పిలిపించి చిరంజీవి స్వయంగా తన చేతులతోనే చేపల కూర వండి నాగార్జునకి పెట్టాడట. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జుననే తెలియజేయడం విశేషం…ఇక ఇది ఇక ఉంటే ఆ జనరేషన్ హీరోలలో నాగార్జునకి చిరంజీవికి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన ను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు…