spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Lok Sabha Elections 2024: ఐదో విడత పోలింగ్‌ షురూ.. జోరెవరిదో!

Lok Sabha Elections 2024: ఐదో విడత పోలింగ్‌ షురూ.. జోరెవరిదో!

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్‌ సోమవారం(మే 20న) ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఈ విడతలో పోలింగ్‌ జరుగనుంది. 49 స్థానాలకు 695 మంది బరిలో ఉన్నారు.

పోటీలో ప్రముఖులు..
ఐదో విడత పోలింగ్‌లో కేంద్రం మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, పీయూష్‌గోయల్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా వంటి ప్రముఖులు ఉన్నారు.

రాష్ట్రాల వారీగా ఎన్నికలు ఇలా..
ఇక రాష్ట్రాల వారీగా పోలింగ్‌ జరిగే స్థానాలను పరిశీలిస్తే ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 14, మహారాష్ట్రలో 13, పశ్చిమబెంగాల్‌లో 7, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, జమ్ముకశ్మీర్‌లో 1, లద్దాక్‌లో 1 స్థానానికి పోలింగ్‌ జరుగుతుంది. ఐదో దశతో కలిపితే ఇప్పటి వరకు 428 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి.

రాయబరేలీ, అమేథీలపై అందరి దృష్టి..
ఐదో విడత ఎన్నికలు జరిగే రాయబరేలీ, అమేథీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌ కంచుకోటలు. అయితే ఐదేళ్ల క్రితం అమేథీలో రాహుల్‌గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించి కంచుకోటను బద్దలు కొట్టారు. ప్రస్తుతం రాహుల్‌ రాయబరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి స్మృతి ఇరానీ బరిలో ఉన్నారు. స్మృతిపై గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కిశోరిలాల్‌ శర్మ పోటీ చేస్తున్నారు. ఇక లఖన్‌వూలో హ్యాట్రిక్‌ విజయంపై రాజనాథ్‌సింగ్‌ గురిపెట్టారు.

బారాముల్లాలో శతాధిక వృద్ధ ఓటర్లు..
ఇదిలా ఉంటే.. ఐదో విడతలో ఎన్నికలు జరిగే జమ్ముకశ్మీర్‌లోని బారాముల్ల లోక్సభ నియోజకవర్గంలో 17.37 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందలో శతాధిక వృద్ధులు 500 మందికిపైగా ఉన్నారు. బారాముల్లాలో మొత్తం 22 మంది పోటీలో ఉన్నారు. వారిలో 14 మంది స్వతంత్రులే. ఇక్కడ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లాకు మాజీ మంత్రి సజ్జాద్‌ లోన్‌ నుంచి గట్టి సవాల్‌ ఎదురవుతోంది.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper