Actor Suresh: స్టార్ హీరోయిన్ సౌందర్య మరణించి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈతరం ప్రేక్షకులు కూడా ఈమెను లైక్ చేస్తుంటారు. సౌందర్య నటించిన సినిమాలు చాలా వరకు హిట్లే ఉన్నాయి. ఒకప్పుడు ఈమె నటిస్తుంది అంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే టాక్ ఉండేది. సడన్ గా హెలికాప్టర్ యాక్సిడెంట్ లో మరణించడంతో సినిమా ఇండస్ట్రీ విషాదంలోకి వెళ్లింది. కానీ ఇప్పటికీ ఈమెను చాలా మంది మరిచిపోలేదు అనేది వాస్తవం. అయితే ఈమె గురించి నటుడు సురేష్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.
సురేష్, సౌందర్య కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈయన రీసెంట్ గా సౌందర్య యాట్టిట్యూడ్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. అమ్మోరు సినిమాలో నటించే సమయానికి తెలుగు రాదని ఆ సమయంలో డైలాగ్స్ పలకడం ఇబ్బందిగా అనిపించి డైలాగ్స్ విషయంలో తన సహాయం కోరిందని తెలిపారు సురేష్. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో సౌందర్య చాలా అణుకువతో ఉన్నారని.. అంతేకాదు చాలా సింపుల్ గా ఉండేదని కొనియాడారు. ఇక ఆమెకు నటననే ఫ్యాషన్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సౌందర్య చాలా హార్డ్ వర్కర్ అని.. అమ్మోరు సినిమా పూర్తయ్యే సమయానికి సౌందర్య చాలా తెలుగు నేర్చుకుందని తెలిపారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈమె స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుందని చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరి కాంబోలో చివరి సారిగా వచ్చిన సినిమా దేవీపుత్రుడు. స్టార్ డమ్ వచ్చాక చాలా మంది యాట్టిట్యూడ్ చూపిస్తారని.. కానీ సౌందర్య మాత్రం ఎప్పుడు ఒకేలా ఉందని కామెంట్స్ చేశారు సురేష్.
ఈమె మరణించినా.. తమ హృదయాల్లో నిలిచే ఉంటుందని..ఈమె లాంటి హీరోయిన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో లేరని అభిప్రాయం వ్యక్తం చేశారు సురేష్. ఇక సౌందర్య అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంది హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఈమె లేకున్నా కూడా ఈమెకు అభిమానులు ఉండడం గమనార్హం.