రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిపై మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో జగనన్న ”బీరు పండుగ” ఘనంగా ప్రారంభమయ్యిందని పేర్కొన్నారు. మద్యనిషేదం మాటున చీకటి దందా యథేచ్ఛగా సాగుతుందని, మద్యనిషేధం అంటే రేట్లు పెంచడం అని వైసీపీ కొత్త అర్థం చెప్పిందని ట్వీట్ చేశారు.
లాక్ డౌన్ లో పరవళ్లు తొక్కుతున్న మందుబాబులు
వైన్ కేసుల్లో కమీషన్లు తీసుకుని ప్రమాదకరమైన లిక్కర్ అమ్మి జనాల ఆరోగ్యంతో చెలగాటమాడటమని సీఎం జగన్ సరికొత్త అర్థం చెప్పారని, లాక్డౌన్ టైములో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలకలు తాగిన కోట్ల రూపాయల మద్యం లెక్కలు సరిచేసేందుకే వైన్ సేల్స్కి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని విమర్శించారు. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధించి పడేస్తాను అని ఎన్నికల ముందు జగనన్న చెప్పిన మాటలను గుర్తు చేశారు.