Water : మన శరీరానికి నీరు ఎంతో అవసరం. నీరే ప్రాణాధారం. అందుకే ఒక రోజు అన్నం తినకుండా ఉండగలం కానీ నీళ్లు తాగకుండా బతకలేం. అన్ని ప్రాణులకు నీరే ఆధారం. నీరు తాగనిదే ఏ జంతువు కూడా బతకదు. ఈనేపథ్యంలో మన శరీరంలో జరిగే జీవక్రియలకు నీరే రక్షణగా నిలుస్తుంది. అందుకే మంచినీరు తగినంత తాగకపోతే ఇబ్బందులు రావడం ఖాయం. మన శరీరంలోని అవయవాలకు నీరే అండగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో మన ఆహార అలవాట్లలో మంచినీరు కూడా ఒకటి కావడం గమనార్హం.
నీళ్లు తక్కువ తాగితే..
మంచినీళ్లు తక్కువ తాగితే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. నీరు తక్కువైతే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. మలబద్ధకం, తలనొప్పి, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, చర్మం పొడిబారడం, ముడతలు పడటం, మలినాలు పేరుకుపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోతే ఆరోగ్యం దెబ్బ తింటుంది. భోజనం చేసే సమయంలో కూడా నీళ్లు తాగుతుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. ఇలా తాగితే అవి విషంగా మారే అవకాశం ఉంటుంది. దీని వల్ల జీర్ణాశయంలో క్రియలు సరిగా జరగవు.
నీళ్లు ఎలా తాగాలి?
ఉదయం సమయంలో నిద్ర లేవగానే లీటర్ పావు నీళ్లు తాగాలి. తరువాత మలవిసర్జన సులభంగా జరుగుతుంది. ఓ అరగంట తరువాత మళ్లీ ఓ లీటర్ పావు నీళ్లు తాగాలి. దీంతో మన శరీరంలోని మలినాలు పూర్తిగా బయటకు పోతాయి. ఇక అల్పాహారం చేసే అరగంట ముందు ఓ ఓ గ్లాసు నీళ్లు తాగితే మంచిది. పిదప గంటన్నర నుంచి అరగంటకోసారి ఓ గ్లాసు చొప్పున తాగడం వల్ల మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం అవుతాయి. ఒకేసారి అధికంగా తాగకూడదు. ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అరగంటకోసారి
తిన్న తరువాత గంటన్నరకు నీళ్లు తాగాలి. ప్రతి అరగంటకు ఓ గ్లాసు చొప్పున తాగుతుండాలి. దీని వల్ల మనకు శరీరం హైడ్రేషన్ కు గురికాదు. ఇలా నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగుతుంటే రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మనం తిన్న ఆహారం పేగుల నుంచి బయటకు రావడానికి నీళ్లు సాయపడతాయి. మలం మిగిలిపోకుండా ఉండేలా చేస్తాయి. నీళ్లు తాగడం వల్ల మన కడుపులో ఎలాంటి మలినాలు లేకుండా శుభ్రం చేస్తుంటాయి.