Drinking Water: మనలో చాలామంది ఆహారం తిన్న వెంటనే మంచి నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగవచ్చా? అనే ప్రశ్నకు వైద్య నిపుణుల నుంచి కాదనే సమాధానం వినిపిస్తూ ఉండటం గమనార్హం. భోజనం తినే ముందు తిన్న తర్వాత అరగంట పాటు నీళ్లు తాగకుండా ఉంటే మంచిది. నీళ్లు తాగే విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
నీళ్లను వేగంగా తాగకుండా సిప్ చేస్తూ తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎవరైతే నీళ్లను వేగంగా తాగుతారో వాళ్లను ఎసిడిటీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మరీ వేడిగా ఉండే నీటిని, మరీ చల్లగా ఉండే నీటిని తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. చల్లని నీళ్లు తాగాలని భావించే వాళ్లు ఫ్రిజ్ లోని నీటిని తాగకుండా ఉంటే మంచిది.
Also Read: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
ఆహారం తీసుకున్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణక్రియ ప్రక్రియ మందగించడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆహారం తిన్న తర్వాత నీళ్లు తాగకుండా ఉంటే శరీరంలో చేరిన హైడ్రోక్లోరిన్ యాసిడ్ ఆహారం వేగంగా జీర్ణమయ్యేలా చేయడంలో తోడ్పడుతుందని చెప్పవచ్చు. నీళ్లను తాగితే శరీరంలో హైడ్రోక్లోరిన్ ఎక్కువ మొత్తంలో చర్య జరిపే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఆహారం తినే సమయంలో ఈ నియమాలను గుర్తుంచుకోవడం ఆరోగ్య సంబంధిత సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నీళ్లు తాగే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోక తప్పదని చెప్పాలి.
Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
సంగీత ప్రపంచంలో డిస్కో గోల్డ్ మాన్
వరుణ్ తేజ్ ‘గని’ రన్ టైం ఎంతంటే?