Drinking Water: మనలో చాలామంది వేసవికాలంలో నీళ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సంవత్సరం సంవత్సరానికి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళుతోంది. అయితే పరిమితికి మించి నీళ్లు తాగడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. అదేపనిగా నీళ్లు తాగితే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.
శరీర బరువుతో పాటు శారీరక శ్రమ, వాతావరణం ఆధారంగా నీళ్లను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలంటే రోజుకు 8 గ్లాసుల నీళ్లను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఎవరైతే ఎక్కువగా నీళ్లను తీసుకుంటారో వాళ్లకు కిడ్నీలపై భారం మరింత పెరుగుతుంది. ఎక్కువ నీళ్లు తాగేవాళ్లను ఒత్తిడి, ఆందోళన, అలసట, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.
Also Read: Prashant Kishor- Chandrababu Naidu: పీకే వ్యూహాల మీదే బాబు భవితవ్యం ఆధారపడిందా?
ఎవరైతే పరిమితికి మించి నీళ్లు తాగుతారో వాళ్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లెవెల్స్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లెవెల్స్ తగ్గితే తిమ్మిర్లు, కండరాల నొప్పులు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పరిమితికి మించి నీళ్లు తాగడం వల్ల వికారం లేదా వాంతులు సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే మాత్రం మరింత ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి.
శరీరంలో నీటిస్థాయిలు అధికమైతే మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. నీటిని ఎక్కువగా తీసుకుంటే డైల్యూషనల్ హైపోనాట్రేమియా లాంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
Also Read: Ghani Movie Non Theatrical Deal: ‘గని’కి 25 కోట్ల డీల్.. ఏమిటి నిజమేనా ?