Surekha Vani : నటి సురేఖావాణికి సినిమా ఆఫర్స్ తగ్గాయనేది నిజం. దర్శకుడు శ్రీను వైట్ల ఫార్మ్ లో ఉన్నప్పుడు సురేఖవాణికి మంచి పాత్రలు దక్కాయి. లేడీ కమెడియన్ గా పాపులర్ అయ్యింది. రెడీ, దుబాయ్ శ్రీను, నమో వెంకటేశా, బాద్ షా చిత్రాల్లో సురేఖావాణి కామెడీ నవ్వులు పూయిస్తుంది. 2019లో సురేఖావాణి భర్త అనారోగ్యంతో మరణించాడు. దాంతో ఆమె కొన్నాళ్ళు వెండితెరకు దూరమైంది. ఈలోగా లాక్ డౌన్ రావడంతో సురేఖావాణికి మరింత గ్యాప్ వచ్చింది. ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలు కూడా ఆమెను మర్చిపోయారు.
ఆఫర్స్ తగ్గిన వెంటనే సురేఖావాణి తెలివిగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. గ్లామరస్ ఫోటోలు, వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. తనతో పాటు కూతురు సుప్రీతను కూడా సురేఖావాణి ఫేమస్ చేసింది. కాగా సురేఖావాణి సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే ఆమె లగ్జరీ లైఫ్ అనుభవిస్తుందని అర్థం అవుతుంది. పార్టీలు, విందులు వినోదాలు, విహారాల్లో తేలియాడుతుంది. చేతిలో సినిమాలు కూడా లేవు. ఈ జల్సాలకు డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో అఫైర్స్ పెట్టుకుంటున్న సురేఖావాణి విలాసవంతంగా జీవిస్తుంది అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు సురేఖావాణి సమాధానం చెప్పారు. తెలుగులో సినిమాలు చేయకున్నా, తాను తమిళంలో చిత్రాలు చేస్తున్నట్లు సురేఖావాణి వెల్లడించింది. ఆ డబ్బులతో సర్వైవ్ అవుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. తన డ్రెస్సింగ్, ఫేస్ చాలా రిచ్ గా ఉంటాయి. అందుకే నేను లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ నేనేమీ విలాసవంతంగా బ్రతకడం లేదని సురేఖావాణి అన్నారు.
అలాగే నిర్మాత కేపీ చౌదరి డ్రగ్ కేసులో అరెస్ట్ కాగా సురేఖావాణి పేరు వినిపించింది. కేపీ చౌదరితో ఆమె సన్నిహితంగా దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదని సురేఖావాణి వివరణ ఇచ్చింది. తాజాగా ఈ ఆరోపణల మీద కూడా సురేఖావాణి మాట్లాడారు. డ్రగ్ ఆరోపణలు బాధకు గురి చేశాయన్న సురేఖావాణి, ఇంట్లో ఒంటరిగా ఏడ్చిందట. అప్పుడు కూతురు సుప్రీత మద్దతుగా నిలిచిందని సురేఖావాణి అన్నారు. భర్త మరణం కూడా డిప్రెషన్ కి గురి చేసినట్లు సురేఖావాణి వెల్లడించింది.