Ebrahim Raisi
Ebrahim Raisi: అజర్ బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హత్యకు గురయ్యారని చాలా దేశాలకు చెందిన ప్రముఖులు ఊహాగానాలు చేశారు. ఈ హత్యలో ఇరాన్ బద్ధశత్రువు ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని వారు అనుమానిస్తున్నారు.
రైసీ వివాదాస్పద పదవీ కాలం దృష్ట్యా దేశీయ శత్రువుల ప్రమేయం గురించి కూడా ప్రశ్నలు తలెత్తాయి. యూరోపియన్ పార్లమెంట్ మాజీ సభ్యుడు నిక్ గ్రిఫిన్ మాట్లాడుతూ, ‘మొస్సాద్ (ఇజ్రాయెల్ జాతీయ నిఘా సంస్థ) ప్రమేయం ఉండడానికి ఆశ్చర్యపోనవసరం లేదు. స్పష్టమైన గాజా / హిజ్బుల్లా / ఇరాన్ / ఇజ్రాయెల్ ఉద్రిక్తతలకు మించిన కారణాలున్నాయి.’
ఇటీవలి సంవత్సరాల్లో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య ‘దీర్ఘకాలిక సహకారం’, ‘స్నేహం, సౌభ్రాతృత్వానికి’ చిహ్నంగా ఉన్న ఒక మెగా ప్రాజెక్టు అని రైసీ, అతని అజర్ బైజాన్ సహచరుడు తమ సరిహద్దులో ఖిజ్ ఖలాసీ జలవిద్యుత్ ఆనకట్టను తెరిచారని గ్రిఫిన్ ఎక్స్ (ట్విటర్) లో ఒక పోస్ట్ చేశాడు.
రెండు షియా దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం అజర్ బైజాన్, ఆర్మేనియా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు మాత్రమే సహాయపడుతుందని ఆయన ఒక విశ్లేషణలో చెప్పారు. నగోర్ నో- కరాబాఖ్ లో ఆర్మేనియన్ ఫైటర్లను నాశనం చేసేందుకు ఉపయోగించే డ్రోన్లు, ఇతర ఆయుధాలను విక్రయించి ఇజ్రాయెల్ భారీ లాభాలు ఆర్జిస్తోంది. అర్మేనియన్లకు ఇరాన్ గట్టిగా మద్దతు ఇస్తోంది’ అని గ్రిఫిన్ అన్నారు.
హెలీకాప్టర్ ప్రమాదంలో 63 ఏళ్ల రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ తో పాటు మరో ఏడుగురు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సోమవారం ధృవీకరించింది.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇది హత్య అని నేను అనుమానిస్తున్నాను. ఇరాన్ సమగ్రంగా దర్యాప్తు చేస్తుందో లేదో చూడాలి. దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని నేను అనుమానిస్తున్నాను’ అని ఓ సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ అరేబియాపై ఇరాన్ పరోక్ష యుద్ధాల వెనుక రైసీ ప్రధాన వ్యూహకర్త అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. సదరు యూజర్ మాట్లాడుతూ.. అసమ్మతిని క్రూరంగా అణచివేశాడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులను హింసించాడు, చంపాడు.’ అన్నారు.
ఖండించిన ఇజ్రాయెల్
ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ప్రమాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ అధికారి రాయిటర్స్ కు తెలిపారు. ‘అది మేము కాదు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి చెప్పారు.
ఇజ్రాయెల్-ఇరాన్ సంబంధాలు..
డమాస్కస్ లో ఇరాన్ జనరల్ మొహమ్మద్ రెజా జహేదీని ఇజ్రాయెల్ హత్య చేయడం, గత నెలలో ఇరాన్ భారీ డ్రోన్, క్షిపణి దాడులతో సహా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతల మధ్య రైసీ మరణంలో ఇజ్రాయెల్ పాత్ర గురించి అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా ఇరాన్ సీనియర్ సైనికాధికారులు, అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ కొన్నేళ్లుగా అనేక దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఆదివారం జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఇజ్రాయెల్ అధికారులు ఈ ఘటనపై స్పందించలేదు.
Iran President Ebrahim Raisi died in helicopter crash
I suspect this was an assassination
We will see if Iran will investigate throughly
I suspect Israel is behind this pic.twitter.com/ukhVJigBDt
— Furkan Gözükara (@GozukaraFurkan) May 20, 2024