Star Heroine: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కలిసి నటిస్తారు కాబట్టి వాళ్ల మధ్య ప్రేమ పుట్టడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. అలా ఇండస్ట్రీలో చాలామంది ప్రేమించుకొని పెళ్లి చేసుకొని సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక మరికొందరు మాత్రం ప్రేమించుకొని ఆ తర్వాత విడిపోయి వేరే పెళ్లి చేసుకొని తమ తమ లైఫ్ లో సెటిలైన వారు కూడా ఉన్నారు.
అయితే తెలుగు సినిమా ప్రేక్షకులకు చాలా ఇష్టమైన హీరోయిన్ జెనీలియా. ఈమె తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో నటించింది. ముఖ్యంగా ఈమె చేసిన సినిమాల్లో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా బొమ్మరిల్లు, సై, ఢీ లాంటి సినిమాలు ఆమె కి మంచి పేరు తీసుకువచ్చాయి. అయితే ఈమె రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే వీళ్ళ ప్రేమ, పెళ్లి అనేది చాలా విచిత్రంగా జరిగింది. ముఖ్యంగా జెనీలియా రితీష్ ను ఎయిర్ పోర్ట్ లో చూసింది. రితీష్ జెనీలియా తో మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పటికీ జెనిలియా మాత్రం ఆయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దానికి కారణం ఏంటంటే రితేష్ దేశముఖ్ మహారాష్ట్ర సీఎం అయిన విలాసరావు కొడుకు అనే విషయం తనకి తెలుసు.
అందుకే రితీష్ ను ఏదో ఆకతాయి గా తిరిగే కుర్రాడని అనుకుంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ‘తుజే మేరీ కసమ్ ‘ అనే సినిమాలో నటించారు. ఇక అప్పుడు వీళ్ళ మధ్య మంచి పరిచయమైతే ఏర్పడింది. దాంతో ఆ తర్వాత మస్తీ అనే సినిమాలో కూడా కలిసి నటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత రితేష్ జెనీలియా ని వదిలి ఉండలేకపోయాడు దాంతో తను ప్రేమించిన విషయాన్ని జెనీలియా కి తెలియజేశాడు. ఇక ఆమె కూడా తన మీద ఇష్టాన్ని రితేష్ కి చెప్పింది. ఇక వీళ్ళు చాలా రోజులపాటు ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. కానీ వీళ్ళ పెళ్లి కి మాత్రం రితేష్ వాళ్ళ ఫాదర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. దాంతో రితేష్ చాలా రోజులపాటు కష్టపడి వాళ్ళ నాన్నని ఒప్పించి మొత్తానికైతే జెనిలియా ను పెళ్లి చేసుకున్నాడు.
ఈ ప్రాసెస్ లోనే జెనీలియా కి రితేష్ ని వదిలేయమని చాలా బెదిరింపు కాల్స్ కూడా వచ్చినట్టుగా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి. కానీ తను ఏమాత్రం భయపడకుండా రితీష్ ని పెళ్లి చేసుకుంది… మొత్తానికైతే వీళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు…