CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓఎస్డీగా బి.అజిత్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్కు చెందిన ఆయన ఐదేళ్లపాటు డిప్యుటేషన్పై రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయనున్నారు. ఆయనను ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అజిత్రెడ్డి 2012 బ్యాచ్కు చెందిన అధికారి. గతంలో ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెట్ బోర్డుల్లో పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్నారు.
ఎవరీ అజిత్ రెడ్డి?
ఇండియన్ డిఫెన్స్ సర్వీస్కు చెందిన అజిత్రెడ్డి గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారిగా పనిచేశారు. అలాగే ఆగ్రా కంటోన్మెంట్లోనూ పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్నారు. ఇలా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న ఆయన డిప్యుటేషన్పై తెలంగాణ ముఖ్యమంత్రి ఓఎస్డీగా పనిచేయనున్నారు.
కేంద్ర సర్వీసుల్లో వారికి ప్రాధాన్యం..
ఇక కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న మరికొందరు అధికారులను కూడా తన టీమ్ లో చేర్చుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇద్దరు అదనపు బ్యూరోక్రాట్లను సెక్రెటరీలుగానియమించాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేష్కుమార్, మాణిక్కరాజ్ సీఎంవో అదనపు సెక్రెటరీలుగా నియమించాలని చూస్తున్నారు. లోకేశ్కుఆర్ను రిలీవ్ చేయడానికి ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ పెండింగ్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో పనిచేస్తున్న మాణిక్కరాజ్ను రాష్ట్రానికి రప్పించాల్సిన అవసరం ఉంది.