కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తప్పును ప్రపంచవ్యాప్తంగా మోడీ ఎందుకు ఎండగట్టడం లేదు. వేదికలపై నిలదీయడం లేదన్నది సమస్య. నాడు ఇందిరాగాంధీ నుంచి నేటి కాంగ్రెస్ మన్మోహన్ వరకూ కశ్మీర్ విషయంలో మన వాణిని గట్టిగా వినిపించలేక ప్రపంచ దేశాల ముందు మనదే తప్పు అని ఫోకస్ చేశారు. ఇప్పుడు మోడీ అయినా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కుట్రను బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రపంచం ఇంకా కశ్మీర్ పై అసత్యాలు నమ్ముతోంది. భారత్ ఈ విషయంలో విఫలమైనట్టు కనిపిస్తోంది. మన దేశ ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి ప్రపంచ దేశాలు మౌనంగా ఉంటున్నాయి. కానీ మన దేశం తేలిపోతే కశ్మీర్ పై మనల్ని ప్రపంచ దేశాలు విలన్లు చేస్తాయి.
కశ్మీర్ విషయంలో అసలు వివాదం ఏంటన్నది ప్రపంచ దేశాల వారికి నిజంగా తెలియదు. నిజాన్ని ప్రపంచానికి తెలిసేలా చెప్పలేకపోతోంది.మోడీ సర్కార్ ఈ విషయంలో ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది. కశ్మీర్ విషయంలో భారత్ దే తప్పు అని ప్రపంచమంతా అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచదేశాలకు కశ్మీర్ విషయంలో అసత్యాలు నమ్ముతున్నాయి. ఇందులో నిజనిజాలను మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా బయటపెట్టాలి.
ఎందుకు ప్రపంచం ఇంకా కాశ్మీర్ పై అసత్యాలు నమ్ముతుంది? మోడీసర్కార్ ఏం చేయాలన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.