Crime : మంచికి పోతే చెడు ఎదురవుతుందని ఓ సామెత. ఇది ఆ యువకుడి జీవితంలో నిజమైంది. చూడగానే నచ్చడంతో ప్రేమించాడు. తన ప్రేమను వ్యక్తపరిస్తే ఆ అమ్మాయి కూడా కొద్ది రోజులయిన తర్వాత ఓకే చెప్పింది. మనసులు మనసులూ కలవడంతో శారీరకంగా దగ్గరయ్యారు. కొన్నాళ్లపాటు ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా కలుసుకుంటూ ఉండేవారు. ఇలా ఒక రోజు వీరి విషయం అబ్బాయి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. దీంతో అతడు విషయం మొత్తం చెప్పేశాడు. కొన్ని రోజుల తర్వాత వారు పెళ్లికి ఒప్పుకున్నారు. తర్వాత జరిగిన దారుణం ఆ అబ్బాయి ఇంట్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది.
ఇందాక మనం చెప్పుకున్న ఆ అబ్బాయి పేరు జయంతన్(29) చెన్నైలోని ఎయిర్ పోర్ట్లో పని చేస్తుంటాడు. మధ్యతరగతికి చెందిన కుటుంబ నేపథ్యం. అతడికి ఒక రోజు ఎయిర్ పోర్ట్లో భాగ్య లక్ష్మి(36) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆకట్టుకునే రూపం ఉండటంతో జయంతన్ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగోలా ఆమె ఫోన్ నంబర్ సంపాదించాడు. మాటలు కలిశాయి. అలా అలా మనసులూ కలిశాయి. తర్వాత తనువులు కలిశాయి. అయితే ఈ విషయం జయంతన్ ఇంట్లో తెలియడంతో అనేక శషభిషల తర్వాత పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఉమ్మడిగా ఉందామంటే భాగ్యలక్ష్మి ఒప్పుకోకపోవడంతో జయంతన్ కుటుంబ సభ్యులను వదిలి వేరు కాపురం పెట్టాడు.
వేరు కాపురం పెట్టిన తర్వాత భాగ్యలక్ష్మి ఇంటి పట్టున ఉండేది కాదు. అస్తమానం ఫోన్లలో మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు జయంతన్ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే సరికి చూడకూడని దృశ్యం చూశాడు. భాగ్యలక్ష్మి మరో వ్యక్తితో కలిసి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను నిలదీశాడు. అప్పుడు తేలింది ఏంటయ్యా అంటే.. భాగ్యలక్ష్మి ఓ సెక్స్ వర్కర్. దీంతో ఇన్నాళ్లూ ఈ విషయాన్ని ఆమె అతడి వద్ద దాచి పెట్టింది. దీంతో అతడు గుండెలు పగిలేలా ఏడ్చాడు. సరే జరిగిందేదో జరిగిందనుకుని మంచిగా ఉండాలని భాగ్యలక్ష్మి ని . దీనికి ఆమె ఒప్పుకుంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ షరా మాములే. దీంతో విసిగి వేసారిన జయంతన్ తన ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచే డ్యూటీకి వెళ్లడం ప్రారంభించాడు. భాగ్యలక్ష్మి రోజూ ఫోన్లు చేసి విసిగించేది. అయితే తన వద్దకు వచ్చే విటులతో జయంతన్ ఉండే ఇంటి వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.
తన వద్దకు రావాలి అనగా అతడు ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఈక్రమంలో తన వెంట తెచ్చుకున్న మారణాయుధంతో అతడిని చంపేసింది. అతడి శరీర భాగాలను ముక్కలు చేసింది. నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెట్టింది. ఏమీ ఎరుగని దానిలా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వచ్చి చూసే సరికి జయంతన్ కన్పించకపోవడంతో వారు వెతికారు. ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫోన్ కాల్స్ ఆధారంగా భాగ్యలక్ష్మిని పిలిపించారు. తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టిస్తోంది.