Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 30 సంవత్సరాల పాటు మెగాస్టార్ గా గుర్తింపు పొందిన హీరో చిరంజీవి… ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకునేలా చేశాయి.ఇక రీఎంట్రీలో చిరంజీవి రెచ్చిపోయి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.
ఇక ఇంతకుముందు మెహర్ రమేష్ తో చేసిన భోళా శంకర్ సినిమా ప్లాప్ అవడంతో ఆయన ఇప్పుడు చేసే సినిమాని హిట్ గా మార్చాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చిరంజీవి చేసిన ఏ సినిమా అయిన కూడా మంచి విజయాన్ని సాధించాలనే ఉద్దేశంతోనే ఆయన సినిమాలని చేస్తారు. అందులో భాగంగానే ఆయన కథలో ఏ మాత్రం లోపాలు లేకుండా చూసుకుంటూ సినిమాలు చేస్తుంటాడు. కానీ కొన్నిసార్లు ఆయన లెక్కలు కూడా తప్పుతు ఉంటాయి. అందువల్లే ఫ్లాప్ సినిమాలు వస్తుంటాయి…
ఇక ఇదిలా ఉంటే చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయన ఒక సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు కొంతమంది ఆయన మీద మర్డర్ అటెంప్ట్ చేయడానికి దాడి చేసినట్టుగా అప్పట్లో చాలా వార్తలు అయితే వచ్చాయి. అయితే అక్కడున్న పోలీసులు తొందరగా అప్రమత్తం ఇవ్వడం వల్ల ప్రమాదం ఏమి జరగకుండా అందరిని సేఫ్ చేశారు. అయితే ఆ ప్రమాదం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలియదు చిరంజీవి యొక్క స్టార్ డమ్ ను చూసి ఓర్వలేక ఎవరో ఇలాంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అంటూ అప్పట్లో పేపర్లో వార్తలు కూడా వచ్చాయి…
మొత్తానికి చిరంజీవి తన హార్డ్ వర్క్ తో ప్రతి సినిమాని చాలా తెలివిగా సెలెక్ట్ చేసుకుంటు ఈ స్టేజి దాకా వచ్చాడు…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రీ ఎంట్రీ లో కూడా ఆయన తన సత్తా చాటుతో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా వరుస సినిమాలను చేస్తూ తనకంటూ ఉన్న స్టార్ డమ్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక 2023 వ సంవత్సరంలో ఎవరికి సాధ్యం కానీ విధంగా రెండు సినిమాను రిలీజ్ చేసి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు…ఇక ఈ రెండు సినిమాల్లో వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ సక్సెస్ అవ్వగా, భోళా శంకర్ మాత్రం ప్లాప్ అయ్యింది…