Chiranjeevi-Amrish Puri: ఇండస్ట్రీని చాలా సంవత్సరాల పాటు ఏకాచత్రాధిపత్యంతో ఏలుతున్న ఒకే ఒక్కడు చిరంజీవి (Chiranjeevi)..ఆయన కెరియర్ డౌన్ అయిన ప్రతిసారి ఒక బ్లాక్ బస్టర్ హిట్టుతో ఇండస్ట్రీలో తనని తాను ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పటికీ సినిమాలు చేస్తు వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు. అందువల్లే ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఎక్కడ పడ్డామో అక్కడే నెగ్గు చూపించాలి అనే నైజం ఉన్న చిరంజీవి ఎప్పుడు ఒక భారీ సినిమాతో వచ్చిన కూడా బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అయ్యేవి…ఇక ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా 3 కోట్ల రూపాయలతో తెరకెక్కి దాదాపు 15 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కాదు. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా చిరంజీవి క్రేజ్ ను తార స్థాయిలో నిలిపిన సినిమా కూడా ఈ సినిమానే కావడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం చిరంజీవి 50 లక్షలకు పైన రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక ఇలాంటి సమయంలోనే ఈ సినిమాలో కీలక పాత్ర అయిన విలన్ క్యారెక్టర్ లో నటించిన ‘అమ్రిష్ పురి'(Amrish Puri) చిరంజీవి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడట ఈయన దాదాపు 70 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. సినిమాలో హీరో అంటే మొదటి నుంచి చివరి వరకు సినిమాలో ఉంటాడు. అతని మీదనే సినిమా మొత్తం రన్ అవుతుంది. ఇక అతన్ని చూసే సినిమా బిజినెస్ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఆయన్ని చూడ్డానికే జనాలు థియేటర్ కి వస్తారు. ఇక ఇలాంటి క్రమంలో ఆయనకి ఎన్ని డబ్బులు ఇచ్చిన పర్లేదు. కానీ విలన్ పాత్ర అంటే సినిమాలో కొత్త సేపే ఉంటుంది.
అలాంటి నటులకు అన్ని డబ్బులు ఎందుకు ఇచ్చారు అనే డౌట్ అప్పట్లో అందరిలో నెలకొంది. నిజానికి ఆ క్యారెక్టర్ కి అమ్రిష్ పురి అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని చిత్ర యూనిట్ అనుకొని, దానికోసమే ఆయన అడిగినంత డబ్బులు ఇచ్చి ఆయన చేత ఆ క్యారెక్టర్ చేయించుకున్నరని అప్పట్లో మీడియాలో చాలా కథనాలైతే వచ్చాయి…
ఈ సినిమా సక్సెస్ లో అమ్రిష్ పురి పోషించిన మంత్రగాని క్యారెక్టర్ కూడా కీలక పాత్ర వహించింది… ఇక దాంతో ఒక విలన్ పాత్ర చేసి చిరంజీవి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడిగా అమ్రిష్ పురి ఒక రికార్డ్ క్రియేట్ చేశాడనే చెప్పాలి…