Young Woman Story: ప్రేమించేటప్పుడు లేని అపార్థాలు పెళ్లయ్యాక కనబడతాయి. పెళ్లికి ముందు దేవతలా కనిపించే ఆమెలో తరువాత దెయ్యం కనబడుతుంది. వివాహానికి ముందు ఎంతో ప్రేమ ఒలకబోసే జంటలు పెళ్లయ్యాక మారిపోయి విడాకులు తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ జంట చేసిన తప్పిదాలతో కష్టాల్లో పడింది. దీంతో ప్రస్తుతం బాధితురాలు న్యాయపోరాటానికి దిగింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రవణ్, మౌనిక లు ప్రేమించుకున్నారు. ఎన్నో ఆశలతో జీవితం నందనవనం చేసుకోవాలని భావించారు. ఊసులు పంచుకుని జీవితాన్ని మధురంగా మలుచుకోవాలని అనుకున్నారు. దీనికి గాను వివాహం చేసుకుని హాయిగా జీవించాలని కలలు కన్నారు.వారి పెళ్లికి ఇంట్లో వారు ఒప్పుకోలేదు. దీంతో వారు ప్రేమ వివాహం చేసుకున్నార.
పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో కాపురం పెట్టారు. కానీ వారి సంసారం ఎక్కువ కాలం నిలవలేదు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నా వారిలో కలతలు మొదలయ్యాయి. మౌనిక శ్రవణ్ పై కేసు పెట్టింది. దీంతో మౌనికతో శ్రవణ్ తల్లిదండ్రులు మా అబ్బాయికి విడాకులు ఇవ్వు నీకు భరణం ఇస్తామని చెబుతున్నారు. దీంతో వ్యవహారం పెద్దది అవుతుందని భావించి మౌనిక నిరాహార దీక్షకు దిగింది.
దీనిపై మౌనిక అత్త, భర్త అనన రవికాంత్ తనపై దాడి చేశారని పోలీసులను ఆశ్రయించింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని వాపోయింది. వరకట్న వేధింపులు పెడుతున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో అత్తవారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసు మరో మలుపు తిరిగింది.