Odi World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టీమ్ భారీ విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ మొదట ఇంగ్లాండ్ టీం కి, ఆ తరువాత పాకిస్తాన్ టీం కి రెండింటికి వరుసగా జలక్ లు ఇచ్చింది.ఈ టోర్నీ లో అడుగుపెట్టేముందు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ మహా అయితే ఒకటి రెండు చిన్న జట్లను ఓడించి టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది అని అందరూ అనుకున్నారు.
కానీ అలా ఆలోచించిన వారి ఆలోచనలకు భిన్నంగా వరుసగా విజయాలను దక్కించుకుంటూ టోర్నీలో పెద్ద జట్లను సైతం మట్టి కరిపిస్తు టీమ్ సత్తా చాటుతూ ముందుకు సాగుతుంది. ఇక ఆఫ్గనిస్తాన్ టీం ఘనమైన పర్ఫామెన్స్ ఇవ్వడం వెనుక చాలా దుర్భరమైన జీవితాలు కూడా దాగి ఉన్నాయి. నిజానికి ఆఫ్గనిస్తాన్ దేశం భూకంపం వచ్చి 3 వేల మంది కి పైన చనిపోవడం జరిగింది. అలాగే రెండు సంవత్సరాల క్రితం ఆదేశం తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది.ఇటు భూకంపం రావడం, అటు తాలిబన్ల చేతిలోకి దేశం వెళ్లిపోవడంతో చాలా మంది జనాలు చాలా రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఇలాంటి క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి చాలామంది వలసలు వెళ్లి దుబాయిలలో సెటిలై అక్కడే జీవిస్తున్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా ఆఫ్ఘనిస్తాన్ టీం క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో ఆడుతూ సాధ్యమైనంత వరకు పోరాటం చేస్తూ అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి కూడా క్రికెట్ ఆడుతున్న చాలా జట్లకు ఏమాత్రం తీసిపోకుండా తనదైన పర్ఫామెన్స్ ని ఇస్తుంది. ఈ దేశం లో చాలా సంవత్సరాల నుంచి క్రికెట్ అనేది లేకపోయినా కూడా ఇప్పుడు వాళ్లు క్రికెట్ ని ఆరాధిస్తూ పట్టుదలతో కనీస సౌకర్యాలు సమకూర్చే స్థాయి లో వాళ్ళ దేశం లేకపోయినా కూడా ఉన్న సౌకర్యాలతోనే వాడుకుంటూ ఆడుతూ అద్భుతాలను చేస్తున్నారు…
గత కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద దేశాలకి ఏ మాత్రం తీసిపోకుండా అద్భుతంగా ఆడుతూ తమదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నారు.ఆఫ్గనిస్తాన్ టీమ్ లో గుర్బాజ్ నబి, రషీద్ ఖాన్, ముజీబ్ రెహ్మాన్, ఫారూఖీ, నవీన్ ఉల్ హక్,షాహిది లాంటి గొప్ప ప్లేయర్లు ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఆఫ్గనిస్తాన్ ప్లేయర్లు ఇండియా నిర్వహించే లీగ్ మ్యాచ్ లు అయిన ఐపీఎల్ లో కూడా చోటు దక్కించుకొని ప్రపంచం లో ఉన్న చాలా మంది ప్లేయర్ల కంటే మేము దేంట్లో తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకుంటున్నారు…ఇక అఫ్గాన్ స్పిన్ దిగ్గజం అయిన రషీద్ ఖాన్ ఇప్పటికే వరల్డ్ లో ఉన్న టాప్ 5 బౌలర్లలో ఒకడిగా ముందుకు దూసుకెళ్తున్నాడు…
ఇక ఇలా ఆఫ్గనిస్తాన్ టీం క్రికెట్ బాగా ఆడుతూ ఎదుగుతున్న క్రమంలో ఇండియా వాళ్లకి చాలా బాగా సపోర్ట్ చేస్తూ క్రికెట్ కి సంబంధించిన ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇండియా వారిని ఆదుకుంటూ వస్తుంది.ఆ క్రమంలోనే వాళ్ళు ఆడాల్సిన మ్యాచ్ లను మన ఇండియా లో ఆడుకునేందుకు వాళ్లకు అవకాశాలను కూడా కల్పించారు. ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లోనూ అజయ్ జడేజా అఫ్గానిస్థాన్కు మెంటార్గా కొనసాగుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ టీం క్రికెట్ పరంగా ఎదగడానికి ఇండియా చాలావరకు హెల్ప్ చేస్తూనే వస్తుంది…ఇక ఈ క్రమం లో ఆఫ్గనిస్తాన్ టీమ్ కూడా చాలా బాగా ఆడి మంచి విజయాలను అందుకొని ఈ వరల్డ్ కప్ లో సెమీస్ లోకి వెళ్ళాలని చూస్తుంది….