Pakistan Vs Sri Lanka: ఇక వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక పాకిస్తాన్ టీమ్ ల మధ్య ఒక భారీ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో శ్రీలంక పైన పాకిస్తాన్ భారీ విజయాన్ని అందుకుంది. అందులో భాగంగానే మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లకి 9 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక టీం ప్లేయర్ అయినా కుశాల్ మెండిస్ 77 బంతుల్లో ఆరు సిక్స్ లు, 14 ఫోర్లతో 122 పరుగులు చేశాడు ఇక ఈయన బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన చేతి కండరాల్లకి సంబంధించిన నొప్పి కలగడంతో ఆయనని హైదరాబాదులోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి తీసుకువెళ్లినట్టు గా శ్రీలంక బోర్డు తెలియజేయడం జరిగింది.
అయితే ఈ మ్యాచ్ లో ఆయన చెలరేగి ఆడి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.ఆయన చేతికి సంబంధించి కండరాల నొప్పి అనేది ఉండటం అలాగే చేతులకి సంబంధించి తిమ్మిర్లు కూడా రావడం జరిగింది అందువల్లే ఆయన హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది. ఇక క్రికెట్ ఆడుతున్న సమయంలో చాలామంది ఇంజురీ అయి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే కుషల్ మెండీస్ కూడా కండరాల నొప్పితో తను మ్యాచ్ మీద పెట్టిన ఫోకస్,చేసిన సెంచరీలు అన్నీ కూడా ఈ మ్యాచ్ కి చాలా వరకు హెల్ప్ అయ్యాయి. ఆయన మాత్రం సెంచరీ చేసి హాస్పటల్లో చేరిపోయాడు. ఇక తను నెక్స్ట్ మ్యాచ్ లో ఆడతాడా లేదంటే ఆయనకు రెస్ట్ ఇస్తారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ టీం 345 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేదించింది.అలాగే శ్రీలంక టీమ్ కి జలక్కిచ్చింది. అలాగే కుశల్ మెండిస్ చేసిన సెంచరీ కూడా వృధా అయ్యింది. ఇక ఈ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్లు అయిన మొహమ్మద్ రిజ్వాన్ అలాగే వాళ్ళ ఓపెనర్ ప్లేయర్ షఫిక్ ఇద్దరు కూడా సెంచరీలు చేసి పాకిస్తాన్ టీం ని విజయ తీరాలకు చేర్చారు. అయితే శ్రీలంక 345 భారీ స్కోర్ చేయడంలో ఆ టీం ప్లేయర్లు అయినా కుశాల్ మెండీస్,సమర విక్రమ ఇద్దరు కూడా అద్భుతమైన సెంచరీలు సాధించారు. దాంతో శ్రీలంక అంత భారీ గా స్కోర్ చేయగలిగింది.ఇక ఎంత చేసిన కానీ శ్రీలంక టీమ్ కి పాకిస్తాన్ చేతిలో ఓటమి మాత్రం తప్పలేదు. ఇక కుశాల్ మెండీస్ ఇంజురీ అయి వెళ్లిపోవడం ద్వారా సమర విక్రమ వికెట్ కీపింగ్ చేయగా, దుషన్ హేమంత్ కుషల్ మెండీస్ కి సబ్ స్టుడ్ ఫీల్డర్ గా రావడం జరిగింది…