Madhuri Dixit: బాలీవుడ్ లో కొందరు మొదట ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత స్టార్లుగా ఎదిగారు. అలాంటి వారిలో మాధురి దీక్షిత్ ఒకరు. 90వ దశకంలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించిన ఈ నటి 1984లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తపస్ పాల్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అబోధ్ సినిమాతోనే ఈమె కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి మార్కులు సంపాదించినా.. కమర్షియల్ హిట్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది మాధురి.ఈ సినిమాల తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించినా.. అవి కూడా సక్సెస్ కాలేదు.
నటన పరంగా ఆకర్షించినా.. కమర్షియల్ హిట్ ను సాధించలేకపోయాయి. నటన బాగుందని ఆఫర్లు ఫుల్ గా వచ్చాయి. అప్పట్లో డైరెక్టర్ సుభాస్ ఘాయ్ రామ్ లఖన్ అనే మల్టీ స్టారర్ మూవీలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈమెకు ఆఫర్లు లైన్ కట్టాయి. పారితోషికం కూడా పెరిగింది. ఖల్ నాయక్ తో ఏకంగా మాధురీ దశ తిరిగిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత కూడా సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆమె సత్తా చాటింది.
వరుస ఆఫర్లు అందుకుంటూ ఆ సమయంలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ గా నిలిచింది. అయితే టీమిండియా మాజీ ప్లేయర్ అజయ్ జడేజాతో లవ్ లో పడింది ఈ అమ్మడు. ఆ తర్వాత జడేజా ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుపోవడం, కుటుంబం కూడా ఒత్తిడి చేయడంతో లవ్ బ్రేకప్ అయింది. ఈ బ్రేకప్ తర్వాత డాక్టర్ శ్రీరామ్ ను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లింది మాధురీ. 2007లో డ్యాన్స్ డ్రామా ఆజా నాచ్ లే తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది మాధురీ దీక్షిత్.
ఈ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని సొంతం చేసుకోవడంతో సినిమాల కోసం అమెరికా నుంచి ఇండియాకు మకాం మార్చింది. ఇక 2022లో వచ్చిన నెట్ ఫ్లిక్స్ సిరీస్ ది ఫేమ్ గేమ్ తో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది మాధురీ. అయితే డ్యాన్స్ రియాలిటీ షో డ్యాన్స్ దీవానే నాలుగో ఎడిషన్ కు జడ్జిగా వ్యవహరిస్తోంది మాధురీ.