Health Tips: కొన్ని సార్లు పిల్లలకు కొన్ని ఆహారాలు జీర్ణం అవడంలో సమస్యలు రావచ్చు. పెద్ద వారికి సంబంధించిన ట్లు జీర్ణ వ్యవస్థ పిల్లలకు ఉండదు. వీరికి చాలా లైట్ ఫుడ్ ఇవ్వాలి. లేదంటే చాలా సమస్యలు వస్తాయి అంటారు నిపుణులు.వారికి మింగడానికి వీలుగా ఉండేలా ఫుడ్ ఇవ్వాలి. అంతేకాదు పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. మరి మీలో కొందరు చపాతీలు కూడా ఇస్తున్నారు కదా. కానీ వారికి ఆ చపాతీలు జీర్ణం అవుతున్నాయా లేదా అనే విషయాన్ని గమనించాలి. లేదంటే వారు జీర్ణ సమస్యలతో బాధ పడతారు.
రోజువారీ భోజనంలో అన్నంతో పాటు చాలా మంది రొట్టెలు తింటుంటారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. రొట్టే అంటే ముందుగా గోధుమ పిండితో చేసిన రొట్టే అనుకుంటారు. చాలా మంది ఇదే రొట్టెను అంటే ఈ చపాతీని మాత్రమే తింటారు. కానీ చాలా మందికి ఈ చపాతీలు జీర్ణం అవడంలో సమస్యలు తెస్తాయట. గొంతు, ఛాతీ, వంటి సమస్యలు కూడా వస్తాయి. గోధుమలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణం అవడం కష్టమే అని చెప్పాలి. ఒక రొట్టె అంటే గోధుమ పిండితో చేసిన రొట్టె మాత్రమే కాదు. మరొక రకం చూసేయండి.
గోధుమలో ఉండే గ్లూటెన్ చాలా మందికి సూట్ అవదట. అలాంటప్పుడు జీర్ణ సమస్యలు ఎక్కువ వస్తాయి. పిల్లలకు కూడా ఈ సమస్యలు వస్తుంటాయి. అందుకే గోధుమలకు బదులు తృణధాన్యాలతో చేసిన రొట్టెను ఇవ్వండి. వోట్స్, మిల్లెట్లు, బార్లీ పిండితో చపాతీని తయారు చేసి ఇవ్వండి. వీటిని తినడంలో పోషకాల లోపం తలెత్తదు. అంతేకాదు బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
గోధుమ పిండికి బదులు జొన్నలతో చేసే రొట్టెలను కూడా పిల్లలు, పెద్దలు తినవచ్చు. ఈ ఆహారం సులభంగా జీర్ణం అవడమే కాదు ప్రోటీన్లు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్ గా ఉంటాయి. మిల్లెట్ లతో చేసిన పిండి రొట్టె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఇందులో ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.