Pawan Kalyan Yuvashakti : ఉత్తరాంధ్రను పవన్ ‘యువశక్తి’ ఉర్రూతలూగించింది. ఈ యువశక్తి ఉత్తరాంధ్రలో మార్పునకు శ్రీకారం చుట్టబోతోంది. యువశక్తి యువతలో ఆక్రోశం, ఆవేదన , ఆవేశం వేదికగా జరిగింది. ఉత్తరాంధ్రలో ఇదో నిశ్చబ్ధ విప్లవం. కొన్ని కుటుంబాల కబంధ హస్తాల్లో ఉన్న ఉత్తరాంధ్ర రాజకీయాన్ని ఇది కదిలిస్తుందని ఆశిద్ధాం. ఈ సమిష్టి ఆక్రోశాన్ని ఉద్యమంగా మలుచుకోవాలి. అప్పుడే ఈ వేదికకు ఫలితం దక్కుతుంది.
ఈ వేదిక ఊపిరిగా ఉద్యమం విస్తరించాలి. సంప్రదాయ రాజకీయాలను బద్దలు కొట్టాలి. ఇది అంత తేలిక కాదు.. ఎంతో శ్రమించాలి. ఈ సభలో మత్స్యకార కుటుంబానికి చెందిన నూకమ్మ మాట్లాడిన మాటలు ప్రతీ ఒక్కరి కళ్లు చెమర్చేలా చేశాయి.
మధ్యలో హైపర్ ఆది మాట్లాడిన మాటలు తూటాల్లా పేలాయి. ముఖ్యంగా ‘ఓడితేనే ఇంత చేసే ఇంత చేసే పవన్ కళ్యాణ్.. గెలిస్తే ఎంత చేస్తాడన్న మాట’ బాగా హిట్ అయ్యింది.
మొత్తం ఉత్తరాంధ్రలోని జీడీ రైతులు సమస్య, ఉద్దానం, గంజాయి సాగుతాగు, వలస బతుకుల జీవన విధానం, వ్యథలు అన్ని కూడా ఉత్తరాంధ్ర పరిస్థితులకు అద్దం పట్టాయి.
ఉత్తరాంధ్రను ఉర్రూతలూపిన జనసేన ‘యువశక్తి’ సభపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.