India vs England : రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారీ విజయం సాధించడంతో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ఇంగ్లాండ్ జట్టుతో జరిగే నాలుగో టెస్ట్ లో బీసీసీఐ కొందరి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో మంగళవారం రాజ్ కోట్ నుంచి క్రాంతి బయలుదేరిన భారత జట్టు.. రోహిత్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటున్నది.
రాంచీలో జరిగే టెస్ట్ మ్యాచ్ కు భారత జట్టు పేస్ బౌలర్ బుమ్రా కు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది.. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం సాయంత్రం ట్విట్టర్ ఎక్స్ లో ప్రకటించింది. అతడి స్థానంలో స్పీడ్ స్టార్ ముఖేష్ కుమార్ కు అవకాశం దక్కేలా కనిపిస్తోంది. ముఖేష్ కుమార్ పేరు మాత్రమే కాకుండా బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్ పేరును కూడా మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టుతో ఆఖరి మూడు టెస్టులకు ఆకాష్ దీప్ ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆకాష్ దీప్ కు దేశవాళీ క్రికెట్లో మెరుగైన రికార్డు ఉంది.
ఇక ఈ సిరీస్ లో ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ రజిత్ పాటిదార్ వినియోగించుకోలేకపోయాడు. అతని స్థానంలో కె.ఎల్ రాహుల్ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వన్నాడు. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్న అతడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు మేనేజ్మెంట్ చెబుతోంది. రాహుల్ రాక నేపథ్యంలో రజిత్ రిజర్వ్ బెంచ్ కే పర్మితం కావలసి వస్తుంది. విశాఖపట్నం టెస్ట్ మ్యాచ్ ద్వారా రజిత్ జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. అతడు రెండు మ్యాచ్ లలోనూ ఆకట్టుకోలేకపోయాడు.
రాంచి టెస్ట్ కు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెన్ను నొప్పితో బాధపడుతున్న అతడికి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నది. మూడో టెస్ట్ రెండవ బ్యాటింగ్ చేస్తూ అతడు తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతూ రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. అయితే అతడికి నాలుగో టెస్ట్ లో విశ్రాంతి ఇచ్చి ఆ స్థానంలో దేవదత్ పడిక్కల్ కు మేనేజ్మెంట్ అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ దేవదత్ ఆడితే ఇది టెస్ట్ ఆరంగేట్రం అవుతుంది.
దేవదత్ రంజీలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ 2023 – 24 సీజన్ కు సంబంధించి సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు. పంజాబ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో భారీ శతకం (193) సాధించాడు. అనంతరం గోవాతో జరిగిన మ్యాచ్ లోనూ సెంచరితో దుమ్ము లేపాడు. అక్కడితో ఆగకుండా ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్ లోను దేవదత్(105) మెరిశాడు. తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ విధ్వంసకరమైన సెంచరీ తో (151) పడిక్కల్ చెలరేగాడు. పడిక్కల్ తన చివరి ఆరు ఫస్ట్ – క్లాస్ మ్యాచ్ లలో నాలుగు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుత రంజి సీజన్ లో 4 మ్యాచ్ లు అడిన పడిక్కల్ 92.67 సగటుతో 556 పరుగులు సాధించాడు. తన ఫస్ట్ క్లాస్ కెరియర్లో ఇప్పటివరకు 31 మ్యాచ్ లు ఆడిన పడిక్కల్ 2,227 పరుగులు సాధించాడు.
జట్టు అంచనా ఇలా ఉండొచ్చు
రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), పడిక్కల్, శుభ్ మన్ గిల్, సర్ఫ రాజ్, ధృవ్ జురెల్, ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్.