Nagababu – Kirak RP : కిరాక్ ఆర్పీ ఒకప్పుడు జబర్దస్త్ స్టార్ కమెడియన్ గా వెలిగాడు. కొన్ని కారణాల వలన ఆయన జబర్దస్త్ మానేసిన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్ లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం స్టార్ట్ చేసాడు. ఈ బిజినెస్ బాగా వర్కౌట్ అయింది. ఇప్పటికే హైదరాబాద్ లో రెండు బ్రాంచీలు ఉన్నాయి. రీసెంట్ గా తిరుపతిలో ఒక బ్రాంచ్ ప్రారంభించాడు. మంత్రి రోజా, హీరోయిన్ మెహ్రీన్ ఓపెనింగ్ కి హాజరయ్యారు.
ఇది ఇలా ఉంటే .. జబర్దస్త్ మానేయడానికి అసలు కారణం ఏంటో ఆర్పీ రివీల్ చేశాడు. నాగబాబు వల్లే మానేశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ .. ఫుడ్, పేమెంట్స్, తో పాటు నాగబాబు కూడా నేను జబర్దస్త్ మానేయడానికి కారణం. ఆయన జబర్దస్త్ వదిలేశాక నేను అక్కడ ఉండలేకపోయాను. నాగబాబు నవ్వితే జనాలు నవ్వుతారు. జనాలు ఎక్కడ నవ్వుతారో తెలిసిన నాగబాబు నవ్వుతారు.
అలా మేము స్కిట్ కొడతాం. అలాగే నాగబాబు బాగా ప్రోత్సహిస్తారు. స్కిట్ బాగుంటే మెచ్చుకుంటారు. ఆషామాషీగా చేస్తే ఊరుకోరు. భయపెడతారు. కొట్టే వరకు వెళ్తారు. స్కిట్ సరిగా చేయకపోతే ప్రాబ్లమ్ ఏంటని అడుగుతారు. అలాగే స్కిట్ లో మితిమించిన డబుల్ మీనింగ్ జోక్స్ ఉంటే కంట్రోల్ చేస్తారు. సూచనలిస్తారు. అంతగా సపోర్ట్ చేసిన నాగబాబు జబర్దస్త్ మానేశాక నాకు కూడా షో వదిలేయాలి అనిపించింది అని కిరాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు.
నెల్లూరు యాసలో తనదైన బాడీ లాంగ్వేజ్ తో కడుపుబ్బా నవ్వించేవాడు కిరాక్ ఆర్పీ. కంటెస్టెంట్ గా వచ్చి టీం లీడర్ గా ఎదిగాడు. నాగబాబు తో పాటు జబర్దస్త్ మానేశాడు. ఆ సమయంలో మల్లెమాల పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత స్టార్ మా లో నాగబాబు జడ్జి గా వ్యవహరించిన ఓ కామెడీ షో లో పాల్గొన్నాడు. ఇప్పుడు పెద్దా రెడ్డి చేపల పులుసు వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు.