Tollywood Beauty Queens: టాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఇప్పుడు అతి పెద్ద కష్టం వచ్చి పడింది. ఇన్నాళ్లు పెద్దగా నటించడం రాకపోయినా.. తమ అందాలను కెమెరా ముందు ఒలకబోస్తూ ఛాన్స్ లు అందుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఎక్స్ పోజింగ్ లో పరిధి పెట్టుకోలేదో ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో కూడా వాళ్లకు ఫుల్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. దాంతో ఫాలోవర్స్ ఎన్ని లక్షలమంది ఉంటే.. అన్ని లక్షలు అన్నట్టు పోస్ట్ కు ఇంత అని తీసుకునే వారు.
ముఖ్యంగా చక్కగా బీచ్ లోకి వెళ్లి విహారయాత్రల పేరిట ఎంజాయ్ చేస్తూ.. మధ్య మధ్యలో బికినీలు ధరించి నాలుగు ఫోజులు ఇచ్చి, ఇటు డబ్బును, అటు ఫుల్ ఫాలోయింగ్ ను మధ్యలో ఫుల్ ఎంజాయ్ ను పొందేవారు. ఇవ్వన్నీ పొందటానికే మొన్నటి వరకు అందాల భామలు అందరూ మాల్దీవుల బాట పట్టి, అక్కడ రెచ్చిపోయి మరీ అందాలతో కనువిందు చేయడం బాగా అలవాటు చేసుకున్నారు.
మెయిన్ గా కరోనా కాలంలో కూడా దేశంలో తన విలయతాండవంతో కరోనా జనాన్ని నిర్ధాక్షిన్యంగా బలి తీసుకుంటే.. అప్పుడు హీరోయిన్లు మాత్రం ఏం పట్టనట్టు చక్కగా మాల్దీవుల బీచుల్లో రెండు పీలికలు వేసుకుని డిఫెరెంట్ డిఫెరెంట్ యాంగిల్స్ లో దర్శనం ఇస్తూ కవ్వించేవారు. అప్పుడు ఈ విషయంలో హీరోయిన్ల తీరు పై చాలా విమర్శలు వచ్చినా.. ఒక్క హీరోయిన్ కూడా వివరణ ఇచ్చే కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఓ దశలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి లాంటి నటుడు కూడా విసిగిపోయి, హీరోయిన్ల పై సీరియస్ అయ్యాడు.
Also Read: జూ.ఎన్టీఆర్ ను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్ చేసిన పని ఇదీ!
అయినా హీరోయిన్లు మాత్రం తమ మాల్దీవుల ట్రిప్ ను మానుకోలేదు. కానీ, ఇప్పుడు వాళ్ళు మాల్దీవులకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. గోవాలో కూడా ఇప్పుడు కొత్తగా అందమైన లోకేషన్స్ ను డిజైన్ చేశారు. పైగా హీరోయిన్లు గోవాకి వచ్చేలా అక్కడి నిర్వహకులు వాళ్ళ కోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించుకున్నారు. దీంతో అందాల భామలందరూ ఇప్పుడు అందాల పరచడానికి గోవానే కరెక్ట్ ప్లేస్ అంటున్నారు.
Also Read: ప్రభాస్ కు ఆనంద్ మహీంద్రా సాయం.. వైరల్ అవుతున్న ట్వీట్ !