Antarctica: ఈ సమస్త భూమండలం ఎన్నో వింతలు విశేషాలకు నెలవు. మన కంటికి కనిపించని అద్భుతాలు ఎన్నో ఈ భూమిపై జరుగుతుంటాయి. మన భూమిపై ఏకంగా నాలుగు నెలల పాటు సూర్యకాంతి పడని ప్రదేశం ఉందన్న సంగతి మీకు తెలుసా? కానీ అలాంటి అద్భుత మంచు ప్రాంతం అంటార్కిటికా.. దక్షిణ దృవానికి దగ్గరగా ఉండే ఈ ప్రాంతం శీతాకాలం మొత్తం 4 నెలల పాటు సూర్యుడు కనిపించడంటే అతిశయోక్తి కాదు. నాలుగు నెలల పాటు చీకట్లో మగ్గే ఈ చీకటి ఖండం గురించి మరెన్నో విశేషాలను తనలో దాచుకుంది.
అంటార్కికా ఖండంలో సూర్యోదయం జరిగింది. నాలుగు నెలల విరామం అనంతరం అక్కడ సూర్య కాంతి వెలుగు చూసింది. మే నెల నుంచి ఆగస్టు వరకు శీతాకాలం కావడంతో అక్కడ సూర్యోదయం ఉండదు. పగలు, రాత్రి అనేది ఉండదు. నిరంతరం చీకటిగానే ఉంటుంది. దీంతో శీతాకాలం ముగిసిపోవడంతో చీకటి తెరలు తొలగిపోయాయి. నాలుగు నెలల సుదీర్ఘ విరామం అనంతరం సూర్యుడి రాకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (యూఎస్ఏ) బృందం ప్రకటించింది. అంటార్కిటికా ఖండంలో సూర్యుడి వెలుగు వ్యాపించడంతో దానికి సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.
అంటార్కిటికా ఖండంలో రెండే కాలాలు ఉంటాయి. శీతాకాలం, వేసవి కాలం అని తెలుస్తోంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. మైనస్ డిగ్రీలు అంటే 70,80 డిగ్రీలకు పడిపోయే వీలుంటుంది. సూర్యోదయం కనిపించదు. దీంతో నాలుగు నెలలు చిమ్మచీకటి ఉంటుంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా చీకటి ఉండటంతో వెలుగు కానరాదు. దీంతో అక్కడ ఏమి కనిపించదు. ఆగస్టులో సూర్యోదయం కావడంతో ఇక అక్కడ అన్ని కనిపిస్తాయి. మొత్తానికి అంటార్కిటికా ఖండంలో వాతావరణ పరిస్థితిపై పలువురు అధ్యయనం చేస్తున్నారు.
అంటార్కిటికాలో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నాలుగు నెలల కాలాన్ని పరిశోధనల కోసం ఉపయోగించుకుంటారు. అక్కడి వాతావరణ పరిస్థితులపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడి వాతావరణం ఇలా ఎందుకు మారుతుందనే దానిపై గత కొన్నేళ్లుగా వివిధ కోణాల్లో పరిశోధనలు కొనసాగిస్తున్న నిజాలు మాత్రం తేలడం లేదు. వ్యోమగాములకు ఉపయోగపడే కొన్ని అంశాలపై వారి అద్యయనం కొనసాగుతోంది.
అంటార్కిటికా ఖండం ఉనికిని గుర్తించినా దానికి గల కారణాలు విస్తు గొలుపుతున్నాయి. అక్కడ మంచు వేగంగా కరుగుతోంది. ఫలితంగా సముద్ర మట్టాలు పెరగనున్నాయి. ఇలాగే మంచు కరిగితే ఉపద్రవాలు నెలకొనే ప్రమాదాలు పొంచి ఉన్నాయని అప్పటికే పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయి. అతివృష్టి, అనావృష్టిలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీనిపై కూడా అధ్యయనాలు కొనసాగుతున్నాయి.