Thaman- Veera Simha Reddy: మ్యూజిక్ డైరెక్టర్స్ తరచుగా కాపీ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటారు. హాలీవుడ్డో, బాలీవుడ్డో నుండి ట్యూన్స్ లేపేస్తారనే వాదన ఉంది. అది నిజం కూడా. టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా చలామణి అయిన ప్రతి ఒక్కరూ ఈ కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందరితో పోల్చితే థమన్, దేవిశ్రీ ఎక్కువసార్లు బుక్ అయ్యారు. ప్రస్తుతం వారిద్దరే టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కావడం విశేషం. కాగా వీరసింహారెడ్డి చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టరన్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘జై బాలయ్య’ తీవ్ర ఆరోపణలకు గురైంది. జై బాలయ్య సాంగ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒసేయ్ రాములమ్మా’ సాంగ్ ని పోలి ఉందని విమర్శలు చేశారు.
తాజాగా ఈ ఆరోపణలపై స్పందించిన థమన్… జై బాలయ్య సాంగ్ ఒసేయ్ రాములమ్మ సాంగ్ నుండి కాపీ చేసిన మాట నిజమే అని ఒప్పుకున్నారు. ఈ విషయం డైరెక్టర్ గోపీచంద్ మలినేని, లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రికి కూడా తెలుసని బాలయ్య అన్నారు. వందేమాతరం శ్రీనివాస్ సర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి నేను పని చేశాను. ఆ పాట స్ఫూర్తితోనే జై బాలయ్య కంపోజ్ చేశానని ఒప్పుకున్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ… దేవిశ్రీ కంపోజ్ చేసిన ‘వచ్చాడయ్యో సామీ’ సాంగ్ కి కూడా ఆధారం ఆ పాటనే అని వెల్లడించారు. అది కల్ట్ ఇమేజ్ ఉన్న పాటని నిజం ఒప్పుకున్నారు. కాగా అల వైకుంఠపురంలో చిత్రానికి థమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. ఆ చిత్ర విజయంలో థమన్ సాంగ్స్ కీలకమయ్యాయి. యూట్యూబ్ ని షేక్ చేశాయి. ఆ దెబ్బతో థమన్ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ పొజిషన్ కి వచ్చాడు .
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటున్నారు. నెక్స్ట్ మహేష్-త్రివిక్రమ్ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నేడు విడుదలైన వారసుడు చిత్రానికి కూడా థమన్ పని చేశారు. థమన్ చేతిలో ఉన్న మరో అతిపెద్ద ప్రాజెక్టు ఆర్సీ 15. థమన్ బిజీఎమ్ కి ప్రసిద్ధి. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను గొప్పగా ఎలివేట్ చేస్తుంది. అఖండ చిత్రానికి థమన్ అద్భుతమైన బీజీఎం ఇచ్చారు.