HomeNewsAndhra Pradesh Rain Alert: ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. నాలుగు రోజుల పాటు...

Andhra Pradesh Rain Alert: ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. నాలుగు రోజుల పాటు డేంజర్!

Andhra Pradesh Rain Alert: ఏపీలో( Andhra Pradesh) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే వాతావరణ హెచ్చరికలకు తగ్గట్టే ఆయా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

Also Read: వైసిపి షేక్.. ఆ మీడియాతో రచ్చ రంబోలా

ఉపరితల ద్రోణి
అయితే తాజా అల్పపీడనానికి తోడు అరేబియా సముద్రం నుంచి తెలుగు రాష్ట్రాలు సహా.. మరో మూడు రాష్ట్రాల మీదుగా బంగాళాఖాతంలో( Bay of Bengal ) ద్రోణి కొనసాగుతూ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో నేటి నుంచి ఈనెల 28 వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరిస్తోంది. ఉత్తర కోస్తా వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు అధికారులు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున సాధారణ ప్రజల సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

రికార్డు స్థాయిలో వర్షాలు..
గడిచిన 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు( heavy rains ) నమోదయ్యాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు లో రికార్డ్ స్థాయిలో 52.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఎన్టీఆర్ జిల్లా పాలేరు బ్రిడ్జిలో 51.8, నందిగామలో 48.4, ఏలూరు జిల్లా భీమడోలులో 47.8, అనకాపల్లి జిల్లా చోడవరంలో 42, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 30, ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం బ్యారేజీ 29, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 29, శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Also Read: వైసీపీ కీలక నేత, జగన్ రైట్ హ్యాండ్ కు నోటీసులు

గోదావరికి వరద
భారీ వర్షాలతో గోదావరి నదికి వరద నీరు పోటెత్తింది. ఏలూరు జిల్లాలో( Eluru district) గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన స్కిల్ దగ్గర నీటిమట్టం దాదాపు 28 మీటర్ల వరకు ఉంది. ఆ వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో లంక గ్రామాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అయితే ఈ నెల 28 వరకు భారీ వర్షాలు ఉండడంతో ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular