Homeఆంధ్రప్రదేశ్‌Anil Kumar Yadav Police Notice: వైసీపీ కీలక నేత, జగన్ రైట్ హ్యాండ్ కు...

Anil Kumar Yadav Police Notice: వైసీపీ కీలక నేత, జగన్ రైట్ హ్యాండ్ కు నోటీసులు

Anil Kumar Yadav Police Notice: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలు ఒక్కొక్కరు జైలుకు వెళ్తున్నారు. వివిధ కేసుల్లో చిక్కుకొని జైలు పాలవుతున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి సైతం అరెస్టు అవుతారని ప్రచారం నడుస్తోంది. ఆయన కంటే ముందే మాజీ మంత్రులు ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో ఒక వార్త హల్చల్ చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓ కేసు విచారణకు పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించారు. దీంతో ఆయన అరెస్టు తప్పదని ప్రచారం ప్రారంభం అయ్యింది. తదుపరి వికెట్ అనిల్ కుమార్ యాదవ్ దేనని తేలిపోయింది. అదే సమయంలో మాజీ మంత్రి రోజాకు సైతం త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

Also Read: జాతీయస్థాయిలో జగన్ ఎటువైపు?

మైనింగ్ లో మాజీ మంత్రి అరెస్ట్ నెల్లూరులో( Nellore ) క్వార్జ్ మైనింగ్ కుంభకోణానికి సంబంధించి మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మైనింగ్ లో వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయితే చాలా రోజులు అజ్ఞాతంలో గడిపిన గోవర్ధన్ రెడ్డిని ఇతర రాష్ట్రాల్లో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు ఇదే మైనింగ్ కుంభకోణంలో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అరెస్టు అయ్యారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఈ మైనింగ్ కుంభకోణంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో అనిల్ యాదవ్ ను అరెస్ట్ చేస్తారని నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేసు విచారణకు హాజరు కావాలని అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం విశేషం.

ప్రశాంతి రెడ్డిని దూషించినందుకు..
అయితే అనిల్ కుమార్ యాదవ్ ( Anil Kumar Yadav) కు ఇచ్చిన నోటీసు మైనింగ్ కుంభకోణానికి సంబంధించినది కాదని తెలుస్తోంది. ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి పై గెలిచారు ప్రశాంతి రెడ్డి. ఈ క్రమంలో అక్కడ రాజకీయం పతాక స్థాయికి వెళ్ళింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంతి రెడ్డి పై వ్యక్తిగత విమర్శలకు దిగారు ప్రసన్న కుమార్ రెడ్డి. అక్కడకు కొద్ది గంటల్లోనే ప్రసన్నకుమార్ ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే అది వేమిరెడ్డి అనుచరుల పనేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో తాజాగా విచారణకు పిలిచారు పోలీసులు. అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరైతే పోలీసులు అరెస్ట్ చేస్తారని ప్రచారం నడుస్తోంది.

Also Read: శ్రీరాముడే కోట్లు తెచ్చే దేవుడు.. ఇదో నయా దందా!

 అధినేతకు వీర విధేయుడు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. వైసిపి హయాంలో చాలా దూకుడుగా వ్యవహరించేవారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కామెంట్లకు దిగేవారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు వెనుకడుగు వేసే వారు కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవారు. నెల్లూరులో తన సామాజిక వర్గ నేతలకు కాదని రైట్ హ్యాండ్ గా అనిల్ కు అవకాశం ఇచ్చారు జగన్. అయితే ఎన్నికల ఫలితాలు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ పెద్దగా కనిపించలేదు. నెల్లూరు వచ్చి రాజకీయ విమర్శలు చేసేవారు. ఆయన దూకుడు పెంచుతున్న నేపథ్యంలో అరెస్టు చేయాలన్న ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular