Homeఅత్యంత ప్రజాదరణచంద్రబాబుకు కుప్పం షాక్.. ఇక మూటముల్లె సర్దుకోవాల్సిదేనా?

చంద్రబాబుకు కుప్పం షాక్.. ఇక మూటముల్లె సర్దుకోవాల్సిదేనా?

chandrababu
టీడీపీ అధినేతకు పెట్టని కోట కుప్పం నియోజకవర్గం. దశాబ్ధాలుగా చంద్రబాబును రాజకీయంగా నిలబెట్టింది ఈ నియోజకవర్గ ప్రజలే. చంద్రబాబు సీఎంగా ఇన్నేళ్లుగా ఏపీ ప్రజలను పాలిస్తున్నారంటే అది కుప్పం ప్రజలుపెట్టిన భిక్షనే. అయితే తాజాగా కుప్పంలో చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంను వదిలివేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: రేవంత్‌ యాక్టివ్‌.. సీనియర్స్‌ సైలెంట్‌

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిడిపి అవమానకరమైన ఓటమిని ఎదుర్కొంది. ఇదిప్పుడు ఏపీ రాజకీయాల్లోనే పెను సంచలనమైంది. రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

కుప్పం నియోజకవర్గంలో టిడిపి మద్దతుదారులు కేవలం 14 గ్రామ పంచాయతీలను గెలుచుకోగా, అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు 73 గ్రామ పంచాయతీలను స్వాధీనం చేసుకున్నారు, ఒక గ్రామ పంచాయతీని స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు.

గత మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబుకు టీడీపీ పెట్టని కోటగా ఉంది. టిడిపి గ్రామ పంచాయతీ ఫలితాల తర్వాత ఇప్పుడు చంద్రబాబుకు గట్టి దెబ్బ తగిలినట్టైంది. టీడీపీ పేలవమైన పనితీరు చంద్రబాబు సీటుకే ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది.

1989 ఎన్నికల నుంచి చంద్రబాబు నాయుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు.. వాస్తవానికి 1995 లో ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు ఎప్పుడూ కుప్పం నియోజకవర్గంలో ప్రచారం చేయలేదు. ఇప్పటికీ ఈ స్థానాన్ని గెలుస్తూనే ఉన్నారు.

కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఝలక్ ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే కుప్పంలో వైసీపీ అభ్యర్థి దాదాపు చంద్రబాబును ఓడించినంత పనిచేశారు.

Also Read: ఆ ఇద్దరు ఎంపీలు హ్యాండ్‌ ఇచ్చారా..: పంచాయతీ ఎన్నికలను అందుకే పట్టించుకోవడం లేదా..?

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరుఫున రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె చంద్రమౌలిని చంద్రబాబు నాయుడుపై నిలబెట్టింది. జగన్ బృందం నిరంతర ప్రయత్నాలు చేయడంతో చంద్రబాబు నాయుడు ఇక్కడ అతి కష్టం మీద గత ఎన్నికల్లో గెలిచారు. ఈ కారణంగానే, 2019 లో చంద్రబాబు నాయుడు మెజారిటీ 2014 లో 48,000 ఓట్లకు గాను 2019కు వచ్చేసరికి 30,722 ఓట్లకు పడిపోయింది.2014 లో 62.5 శాతం ఓట్లు సాధించిన చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో 7.32 శాతం ఓట్లు తగ్గించి 55.18 శాతానికి పరిమితం చేశారు.

2024 ఎన్నికలలో చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికలు చంద్రబాబుపై వ్యతిరేకతను చాటిచెప్పాయి. ఇదే ఊపులో ముందుకెళ్లాలని.. వైసీపీ దెబ్బకు ఇక్కడ టిడిపి చీఫ్ తన నియోజకవర్గాన్ని మార్చుకోవాలని కోరుకుంటోంది. కుప్పం వదిలి చంద్రబాబు పారిపోయేలా ప్లాన్ చేయాలని చూస్తోంది. కుప్పంలో కనుక పోటీచేస్తే చంద్రబాబును చిత్తుగా ఓడించి ఆయన రాజకీయ జీవితంలో తీరని అవమానాన్ని కల్పించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular