spot_img
Homeజాతీయ వార్తలుIndia and Pakistan : భారత్ - పాకిస్తాన్ మధ్య వార్ మొదలైనట్టే.. దాయాది భూస్థాపితం...

India and Pakistan : భారత్ – పాకిస్తాన్ మధ్య వార్ మొదలైనట్టే.. దాయాది భూస్థాపితం కావాల్సిందే..

India and Pakistan : ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత భారత్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. సరిహద్దుల్లో తీవ్రాతి తీవ్రంగా దాడులకు పాల్పడుతున్నారు.. అంతేకాదు ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడంతో దాయాది దేశానికి చెందిన సైనికులు పగతో రగిలిపోతున్నారు. వాస్తవానికి తమదేశంలో టెర్రరిస్టుల క్యాంపులు లేవని లేవని మొదట బుకాయించిన దాయాది దేశం… ఇప్పుడు మాత్రం చనిపోయిన ఉగ్రవాదులు మొత్తం తమ సోల్జర్స్ అని చెప్పడం విశేషం. అందుకే భారత్ పై ప్రతిదాడులకు దిగుతోంది. ఇక నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ డ్రోన్లు, ఫైటర్ జెట్ విమానాలు, క్షిపణులతో దాడులకు దిగుతోంది. జమ్ము కాశ్మీర్, రాజస్థాన్లోని జై సల్మీర్, బికనీర్, పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్, జలంధర్ నగరాలలో అధికారులు ఏకంగా బ్లాక్ అవుట్ ప్రకటించారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను, ఫైటర్ జెట్ విమానాలను భారత సైన్యం నేలమట్టం చేసింది.

Also Read : పాక్ తో ఉద్రిక్తతలు.. ఐపీఎల్ మ్యాచ్ వేదిక మార్పు

అనధికారికంగా యుద్దం మొదలైనట్టే

ఊహించినట్టుగానే పాకిస్తాన్ ప్రతిదాడులకు దిగుతుండడంతో భారత సైన్యం.. వాటిని సమర్థవంతగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్ చేస్తున్న దాడులను గగనతలంలోనే పేల్చివేస్తోంది. మనదేశంలోని ప్రముఖ నగరాలను.. ప్రముఖ విమానాశ్రయాలను పాకిస్తాన్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. వాటిపై దాడులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఇంటలిజెన్స్ ద్వారా ఈ వివరాలు తెలుసుకున్న భారత్.. ముందుగానే అప్రబత్తమైంది.. విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసింది. ప్రజలు బయటికి రాకుండా ఉండాలని సూచించింది. విద్యుత్ దీపాలు.. అన్నింటినీ కట్టేయాలని సూచించింది. ప్రజలు సురక్షితంగా ఉండాలని.. గుంపులు గుంపులుగా ఉండకూడదని సూచించింది. మొత్తంగా చూస్తే భారత్ స్వీయ రక్షణను పాటిస్తోంది. మరోవైపు సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల వల్ల ధర్మశాలలో బుధవారం జరగాల్సిన ఢిల్లీ – పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ రద్దయింది. మొదట్లో వర్షం కురవడంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. ఆ తర్వాత ఫ్లడ్లైట్లలో సాంకేతికపరమైన సమస్య ఏర్పడింది. చివరికి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఇక భారత్ – దాయాది దేశం మధ్య అనఫీషియల్ గా వార్ బిగిన్ అయిన నేపథ్యంలో.. దాయాది దేశాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలని.. అక్కడ టెర్రరిజాన్ని అనేది లేకుండా చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు. మరోవైపు శత్రుదేశం చేస్తున్న ప్రతీకారమైన దాడులను భారత్ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతోంది. ఏమాత్రం నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా.. దాయాది దేశం వికృత దాడులకు పాల్పడకుండా ఉండడానికి ముందుగానే మన దేశం కట్టడి చేస్తోంది. అన్నిటికి మించి ఆర్మీ అన్ని విధాలుగా ముందుండి.. పై చేయి సాధిస్తోంది.

Also Read : పాకిస్తాన్ ప్రతీకార దాడులకి పాల్పడితే జరిగేదేంటి?

war

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper