Homeఆంధ్రప్రదేశ్‌Jagan Mohan Reddy: డీఎస్సీ పై జగన్ బురద రాజకీయం!

Jagan Mohan Reddy: డీఎస్సీ పై జగన్ బురద రాజకీయం!

Jagan Mohan Reddy: ఏదైనా ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగితే న్యాయస్థానాలకు వెళ్లి.. ఉపశమనం పొందుతుంటారు. తప్పకుండా అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంటారు. కానీ ఏపీలో డీఎస్సీ 2025 పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ఆరోపణలు చేస్తోంది. ఏవేవైతే సాక్షిలో డీఎస్సీ నియామకాలపై వచ్చిన అక్రమాల కేస్ స్టడీలపై ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులు సంతృప్తికరమైన వివరణ ఇచ్చారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. చివరకు […]

Jagan Mohan Reddy: ఏదైనా ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగితే న్యాయస్థానాలకు వెళ్లి.. ఉపశమనం పొందుతుంటారు. తప్పకుండా అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంటారు. కానీ ఏపీలో డీఎస్సీ 2025 పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ఆరోపణలు చేస్తోంది. ఏవేవైతే సాక్షిలో డీఎస్సీ నియామకాలపై వచ్చిన అక్రమాల కేస్ స్టడీలపై ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులు సంతృప్తికరమైన వివరణ ఇచ్చారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. చివరకు జగన్మోహన్ రెడ్డి సైతం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ డీఎస్సీ 2025 పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. తలా తోకాలేని ఆరోపణలు చేస్తున్నారు.

* ప్రెస్ మీట్ లో హడావిడి
నిన్ననే వారాంతపు ప్రెస్ మీట్ తో తాడేపల్లిలో ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. తన పక్కన ఒక డీఎస్సీ అభ్యర్థిని కూర్చోబెట్టారు. అతడికి గోల్డ్ మెడల్ ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు అంటూ పెద్ద హడావిడి చేశారు. అయితే ఆ అభ్యర్థి తన డీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్ లో తనకు గోల్డ్ మెడల్ ఉందనే విషయాన్ని అస్సలు పేర్కొనలేదు. దరఖాస్తు లోనే చూపించని అర్హతలను అధికారులు పరిశీలన సమయంలో ఎలా పరిగణలోకి తీసుకుంటారని కనీస స్పృహ లేకుండా జగన్ మాట్లాడుతున్నారు. ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి టాప్ ర్యాంక్ సాధించాడు అంటూ చేసిన ఆరోపణలపై ఇదివరకే విద్యాశాఖ ఆధారాలతో సహా వివరణ ఇచ్చింది. అతడు ఎన్వోసీ తీసుకోనందునే ఉద్యోగం ఇవ్వలేదని స్పష్టం చేసింది. అయినా సరే జగన్ పదేపదే డీఎస్సీ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.

* కోర్టుకు వెళ్లకుండా.
డీఎస్సీలో అక్రమాలు జరిగితే.. ఆధారాలు ఉంటే వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయకుండా బురదజల్లేందుకు మాత్రమే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే డీఎస్సీ పూర్తి పారదర్శకంగా జరిగిందన్నది మెజారిటీ అభ్యర్థుల అభిప్రాయం. కానీ అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించి రాజకీయం చేయాలన్నది జగన్ ఆలోచన. అందుకే అదే పనిగా విషం చిమ్ముతూనే ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు తెలుసు. ఎవరెవరు అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదో వారికి తెలుసు. కానీ ఆరు లక్షల మంది డిఎస్సీ పరీక్షలు రాశారు. అందులో 16 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. మిగతా వారి కుటుంబాల ఓట్ల కోసం ఈ సరికొత్త రాజకీయ ఎత్తుగడ ఆడుతున్నారు జగన్. అయితే ఇది వర్క్ అవుట్ అవుతుందా? అంటే మాత్రం కాదు అనే సమాధానం వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper