Terror Attacks: పార్లమెంటు ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. దేశంలో మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. ఈసారి బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడంతో ఎన్డీఏ పక్షాల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఈసారి ఎన్నికల్లో విపక్షం కూడా బలంగా ఎదిగింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 230 స్థానాలు సాధించింది. ఈ నేపథ్యంలో కశ్మీర్లో ఉగ్రమూకలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. రాజకీయ అస్థిరత సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయి. మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కశ్మీర్లో వరుస ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉగ్రవాదుల ఏరివేతకు సైన్యం కూడా విస్తతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. జమ్మూ కశ్మీర్ను జల్లెడ పడుతోంది.
హిజ్బుల్ కమాండర్ ఇంటర్వ్యూ..
ఒకవైపు కశ్మీర్లో ఉగ్రవాదం పెరుగుతున్న వేళ… ఆశ్చర్యకరమైన పరిణామం చోటుయేసుకుంది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని స్థానిక డిజిటల్ న్యూస్ నెట్వర్క్ ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందిన హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన హై–ర్యాంకింగ్ కమాండర్ షంషేర్ ఖాన్తో ఇంటర్వ్యూ నిర్వహించింది. యూరోపియన్ యూనియన్, ఇండియా, కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్లో ఈ వీడియోను జేకే బోల్ అప్లోడ్ చేసింది. షంషేర్ ఖాన్ సంస్థ యొక్క గత ఉగ్రవాద చర్యల గురించి చర్చిస్తున్నట్లు తెలిపాడు. వారి భవిష్యత్తు చెడు ఉద్దేశాలను వివరిస్తుంది.
బుర్హాన్ వనీపై ప్రశంసలు..
ఇక ఈ ఇంటర్వ్యూలో షంషేర్ఖాన్ కమాండర్ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీపై ప్రశంసలు కురిపించారు. ఐక్యరాజ్యసమితిలో హీరోగా ప్రకటించాలని పాకిస్తాన్ ప్రధాని నొక్కిచెప్పారని తెలిపారు. భారత సైన్యాన్ని దీటుగా ఎదుర్కొనడంతోపాటు భారతీయులు ప్రశాంతంగా ఉండకుండా చూడడమే బుర్హాన్ వనీ లక్ష్యమని షంశేర్ఖాన్ తెలిపాడు.
ఇస్లామిక్ రాజ్యస్థాపలే లక్ష్యంగా..
ఇదిలా ఉంటే హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ 1989లో ఏర్పడింది. కాశ్మీర్లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్లో విలీనం చేయాలని కోరుతోంది. ఈ సంస్థ 1990లో అనేక మందిని కిడ్నాప్ చేసింది. భద్రతా సిబ్బంది హత్యలు, బాంబు దాడులు, రాజకీయ నాయకులు, కశ్మీర్ యువకులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తోంది. ఇలాంటి సంస్థకు చెందిన నాయకులతో ఇంటర్వ్యూ నిర్వహించడం పాకిస్తాన్ వైకరికి నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలు..
జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న తరుణంలో ఈ ఇంటర్వ్యూ వచ్చింది. ఇటీవల, మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదుల దాడిలో తొమ్మిది మంది మరణించగా, 41 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో ఐదుగురు భారత ఆర్మీ సిబ్బంది మరణించారు. ఐదుగురు గాయపడ్డారు.
హిజ్బుల్ చీఫ్గా సయ్యద్ సలావుద్దీన్..
ఇక జమ్మూ కశ్మీర్లో జన్మించిన సయ్యద్ సలావుద్దీన్ 1993లో పాకిస్తాన్ పారిపోయాడు. హిజ్బుల్ ముజాహిదీన్లో చేరాడు. ప్రస్తుతం ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్గా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. 2020, అక్టోబర్లో భారత్ అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది.
పీవోకేలో కార్యక్రమాలు..
ఇక సలావుద్దీన్.. పీవోకేలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. సలావుద్దీన్హిజ్బుల్ ముజాహిదీన్ క్యాడర్లతో పాటు యూజేసీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. దీనిని ముత్తాహిదా జిహాద్ కౌన్సిల్ అని కూడా పిలుస్తారు, ఇది దాదాపు 13 పాకిస్తాన్ ఆధారిత కాశ్మీర్–కేంద్రీకృత ఉగ్రవాద సంస్థల సమ్మేళనం.
భారత్ నుంచి నిధుల సేకరణ..
భారతదేశంలో, ప్రధానంగా కాశ్మీర్ లోయలో తీవ్రవాద కార్యకలాపాలను ప్రేరేపించడం, అమలు చేయడంతోపాటు, సయ్యద్ సలాహుదీన్ హెచ్ఎం క్యాడర్ల ఉగ్రవాద కార్యకలాపాలను మరింత పెంచడానికి వాణిజ్య మార్గాలు, హవాలా మార్గాలు, అంతర్జాతీయ నగదు బదిలీ మార్గాల ద్వారా భారతదేశానికి నిధులను సేకరిస్తున్నాడు. రూట్ చేస్తున్నాడు.
2011లో ఎన్ఐఏ గుర్తింపు..
ఇదిలా ఉంటే.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) 2011 నవంబర్లో తీవ్రవాద చర్యలకు పాల్పడేందుకు నిధులు సేకరించడం/సేకరించడం/అందించడం మరియు తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ఉద్దేశంతో జమ్మూ మరియు కాశ్మీర్లోని తీవ్రవాద గ్రూపులు, వారి సానుభూతిపరుల మధ్య నిధులను పంపిణీ చేయడం వంటి నేరపూరిత కుట్రపై దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మొదట జనవరి 2011 లో కేసు నమోదు చేసింది మరియు తరువాత కేసును ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.
ఆస్తులు జప్తు..
శ్రీనగర్లోని సలావుద్దీన్ కుమారులు షాహిద్ యూసుఫ్, సయ్యద్ అహ్మద్ షకీల్ ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసింది. యూఏపీఏ చట్టం, 1967 కింద ’లిస్టెడ్ ఉగ్రవాది’ అయిన షకీల్ యాజమాన్యంలోని జమ్మూ మరియు కాశ్మీర్లోని శ్రీనగర్, నర్సింగ్ గర్, మొహల్లా రామ్ బాగ్, రెవెన్యూ ఎస్టేట్ వద్ద ఉన్న స్థిరాస్తులు స్వాధీనం చేసుకుంది.